Friday, June 19, 2009

నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా తీరుగా మైక్రోసాఫ్ట్, గూగుల్ పోరు

చిన్నప్పుడు కధల్లో చదువుకున్న ఈ సన్నివేశం ఇప్పుడు ఈ రెండు సాఫ్ట్వేర్ వీరుల మధ్య జరుగుతున్నట్లుంది. ఎవరైనా నెట్ లో ఏదన్నావెతకాలంటే చటుక్కున గుర్తొచ్చేది గూగుల్. సెర్చ్ కి అంత మార్కెట్ ఉంటుంది అని కనిపెట్టి దానికి కావాల్సిన అల్గారిథంస్ రాసి ఎంతో మంది కి డ్రీం కంపనీ అయింది గూగుల్. ఇక పోతే మెయిన్ ఫ్రేం కంప్యుటర్ లు రాజ్యమేలుతున్న రోజుల్లో వ్యక్తి గత పిసి లకు భవిష్యత్తు లో ఉండబోయే మార్కెట్ ను అంచనా వేసి దానికి తగ్గ ఆపరేటింగ్ సిస్టం తయారు చేసి ప్రపంచం లోనే అతి పెద్ద సాఫ్ట్వేర్ కంపనీ గా తయారయ్యింది మైక్రోసాఫ్ట్.

ఇక పొతే నిన్న గాక మొన్న వచ్చిన గూగుల్ ఒక్క సెర్చ్ అనే ఫీచర్ తోనే ఆన్ లైన్ ప్రకటనల తో కోట్లు గడిస్తుండటం తో ఎక్కడో మైక్రోసాఫ్ట్ కి కన్ను కుట్టింది. దానికి తోడు గూగుల్ సెర్చ్ నుంచి తన పరిధిని విస్తరించుకుంటూ చిన్నగా మైక్రోసాఫ్ట్ కి బాగా బలమున్న డెస్క్ టాప్ ఏరియా లో అదుగు పెట్టి దానికి బ్రెడ్ అండ్ బటర్ అయిన ఆఫీస్ లాంటి మీదే గురి పెట్టి చిన్నగా అప్పటిదాకా ఎదురే లేదనుకున్న మైక్రోసాఫ్ట్ కే పోటీదారు గా మారింది. దీంతో మైక్రోసాఫ్ట్ కు పుండు మీద కారం చల్లినట్లు అయింది. "మన పరిధిని మనము పెంచుకొంటూ పోకపోతే అందరూ పోటిదార్లు కలిసి తలా ఒక పక్కనుంచి వచ్చి మనల్ని ప్రెస్ చేసి మనకు ఒక పరిధి అంటూ లేకుండా చేస్తారు" అన్న సిద్ధాంతాన్ని చరిత్రను చూసి అవగతం చేసుకున్న మైక్రోసాఫ్ట్, గూగుల్ కుంభ స్థలాన్నే కొట్టడానికి నిర్ణయించుకుంది. నా బంగారు పుట్టలో ఏలు పెడితే నేను కుట్టనా అంటూ గూగుల్ కి పోటీ గా జూన్ నెలలో "బింగ్" అనే కొత్తసాఫ్ట్ వేర్ ని విడుదల చేసింది. సెర్చ్ తో ఆగకుండా ఒక అడుగు ముందుకేసి "డెసిషన్ ఇంజన్" అనే కొత్త మార్కెటింగ్ అంశం తో ముందుకొచ్చింది. దాని పనితనం కూడా మైక్రోసాఫ్ట్ నుంచి ఆశించిన దాని కన్నా మిన్నగా ఉండటంతో నిపుణులు కూడా ఇప్పటికిప్పుడు గూగుల్ స్థానానికి వచ్చ్హే నష్టం ఎమీ లేకపోయినా ఇక మీద గూగుల్ పని నల్లేరు మీద నడక కాదు అని భావిస్తున్నారు. గూగుల్ కూడా ఈ హఠాత్పరిణామాన్ని ఎదుర్కోవటానికి దాని స్థాపించిన వారిలో ఒకరైన సర్గీ బ్రిన్ ఆధ్వర్యంలో ఒక టీం ని ఏర్పాటు చేసింది అని వినికిడి. అయితే మిగతా వీక్షకులు మాత్రం ముందు ముందు ఈ కొత్త పరిణామం ఈ రెండు యోధుల మధ్య పోటీని భవిష్యత్తు లో ఇంకా తీవ్రంగా, ఆసక్తికరంగా మారుస్తుంది అంటున్నారు.
చూద్దాం ఈ పోటీలో ఎవరు గెలుస్తారో.

Monday, May 18, 2009

ప్రజా రాజ్యం తుస్సు మన్నదా?

ఒక రెండు మూడు రోజుల్నుంచి ఈనాడు లాంటి విష పత్రికల వాళ్లు, మన బ్లాగు సోదరులు అందరు ప్రజా రాజ్యం తుస్సు మంది అనో ఘోరం గా ఓడింది అని అంటున్నారు. అలా అనటం ఎంత వరకు సమంజసం? 
1) ప్రజా రాజ్యానికి వచిన సీట్లు 18, వోట్ల శాతం సుమారు 16. 130 సంవత్సరాల నుంచి ఉన్న పార్టీ  కి  36% వోట్లు వస్తే, 30 ఏళ్ల నుంచి ఉన్న పార్టీ కీ 26% వస్తే, 8 నెలలున్న పార్టీ కి 16% శాతం వోట్లు వచ్చాయి. ఇది విజయం కాదా?. 
2) ఒక వేళ శాతం ప్రకారం సీట్లు వచ్చి ఉంటే కాంగ్రెస్ కి సుమారు 100, తెదేపా కి 75, ప్రరాపా కి 50 వరకు వచ్చి ఉండేవి. ఎనిమిది నెలలు వయసు ఉన్న పార్టీ కి ఇంత స్పందన రావటం తుస్సుమన్నట్లా?    
3) వై యెస్ ఇదేళ్లలో, బాబు 9 ఏళ్లలో వాళ్ల వాళ్ల పాలన ఎంటొ ప్రజలకు చూపించారు. వాళ్లకి వోట్లు వేసిన వాళ్లు ఆ పనులని చూసి వోట్ వేసుంటారు ఆయా పార్టీలకు. కాని ఇంత వరకు రాజకీయాల్లోనే లేని ఒక వ్యక్తి కి 16 శాతం వోట్లు రావటం, ముక్కోణపు పోటి లో ఒక్కరితోను పొత్తు లేకుండా తర తరాల నుంది ఉన్న పార్టీ లను ఖంగు తినిపించి 18 సీట్లు గెలుచుకోవటం వోటమి అవుతుందా?   
4) ఈనాడు, సాక్షి లాంటి విలువల్లేని వార్తా పత్రికలు చిరు పార్టీ పెట్టక ముందు నుంచి చేసిన నెగిటివ్ ప్రచారాన్ని తట్టుకొని, ఎన్నికలు ఇంకో పది రోజులు ఉందనగా పరకాల లాంటి వాళ్ల తో ఆడించిన డ్రామాలను  తట్టుకొని అన్ని సీట్లు సాధించటం ఏ రకంగా వోటమి? ఇప్పుడు ఇలా అనే పత్రికలలో ఒక్కళ్లు కూడా ఎన్నికల ముందు చేసిన విశ్లేషణలలో ప్రజా రాజ్యానికి 40 కన్నా సీట్లు వస్తాయని రాయలేదు. ఇప్పుడు మాత్రం తుస్సు, బర్రు అంటారు.
5) ఒక వేళ వై యెస్ గాని, చంద్ర బాబు కాని వాళ్ల పార్టీ లను వదిలి కొత్త పార్టీ ని పెట్టి వాళ్ల వాళ్ల వ్యక్తి గత బలాల మీద 16% వోట్లు సాధించే దమ్ము ఉందా? అసలు వాళ్లకే కాదు మన రాష్ట్రం లో ఎవరికైనా ఉందా? వాళ్లకు వచ్చే వోట్ల లో సిం హ  భాగం వోట్లు ఆయా పార్టీలను తరతరాలుగా వెన్నంటి ఉన్న ప్రజలవి. ఇలా సొంత బలమే పార్టీ బలంగా వచ్చిన వ్యక్తి 18 సీట్లు సాధించాడు.
6) ఒకప్పుడు రామారావు పార్టీ పెట్టటం తోనే అధికారం లోకి వచ్చాడు. కాని అప్పుడున్నట్లు రాజకీయ శూన్యత, ప్రభుత్వ వ్యతిరేకత ఇప్పుడు లేవు. అవి లేక పోగా విలువల్లేని మీడియా, దబ్బు ప్రభావం ఇలాంటివి దాపురించాయి. ఇవన్ని మన పత్రికలకు చిరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు  రాశారు కూడా. వీటిని తట్టుకొని పార్టీ 18 స్థానాల్లో మొదటి స్థానం లో, 34 స్థానాల్లో రెండో స్థానాల్లో నిలిచింది. ఇది ముమ్మాటికీ గొప్పే. అయితే 230 స్థానాల్లో ముడో స్థానం లో ఉంది అని రాశారు మన "largest circulated daily of AP (that circulates largest number lies daily) " వారు.  
 పార్టీ పెట్టగానే 200 సీట్లు వస్తాయనుకోవటం అతిశయోక్తే అవుతుంది. ఈ మంచి ప్రారంభాన్ని పార్టీ మరింత బలోపేతం చేయటానికి వాడుకుంటారు అని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. 

Wednesday, April 15, 2009

నేనూ వోట్ వేస్తున్నానోచ్!

చిన్నప్పుడు ఎప్పుడో ఎన్నికలు జరిగేటప్పుడు మా అమ్మ తో పోలింగ్ బూత్ లోకి వెళ్లి నేను కూడా చుక్క పెట్టించుకొని బడి లో అందరి దగ్గర ఫోస్ కొట్టేవాడిని వోట్ వేశానని చెప్పి. కొంచెం పెద్ద అయినప్పటినుంచి ఎప్పుడూ ఇంకా ఆ జోలికి పోలేదు. ఇంక చదువు అయ్యాక డిల్లీ లో ఒక ఆరేళ్లు ఉన్నా ఎప్పుడూ వోట్ కి దరఖాస్తు చేయలేదు. ఇక ఈ సారి ఎన్నికలు ఈ మధ్య వచ్చిన కొత్త పార్టీ ల వల్ల చాలా రంజు గా మారాయి. ఎందుకంటే ప్రధాన పార్టీల రేఖలు వాళ్ల బలం మీదే కాకుందా వాళ్ల నుంచి కొత్త పార్టీలకు చీలే వోట్ల మీద కూడా ఆధారపడి ఉన్నాయి. సరే ఏది ఏమైనా ఈమధ్యే నేను హైదరాబాదు రావటం, రాగానే వోట్ కి అప్లయి చేయటం, చేసిన ఇరవై రోజుల్లోనే అది రావటం అన్ని చక చకా జరిగిపోయాయి. మొత్తానికి మొదటి సారి వోట్ వేయబోతున్నాను కాబట్టి  చాలా అనందం గా ఉంది.  
నాలాగే మొదటి సారి వొటు హక్కు ఉపయోగించుకుంటున్న అందరికి శుభాకాంక్షలు, అభినందనలు, విజయం ప్రాప్తిరస్థు.

ఒక ప్రరాపా ప్రెజెంటేషన్

నెట్ లో అవినీతి మీద  రూపొందించిన ప్రజారాజ్యం ప్రెజెంటేషన్ ఒకటి దొరికింది. వీలుంటే చూడండి.  http://www.slideshare.net/PrajaRajyam/anti-corruption

Tuesday, April 14, 2009

లోక్ సత్తా లో నన్ను ఆలోచింప జేసిన విషయాలు

అందరిలాగానే నేను కూడా జెపి గారి ఇంటర్వ్యూ లు, ప్రసంగాలు చూసి ఆయన అభిమానిని అయ్యాను. ప్రజారాజ్యం ఆవిర్భవించినప్పుడు చిరంజీవి లోక్సత్తా తో పొట్టు పెట్టుకుంటే బాగుండు అని అనుకున్న వాళ్ళలో నేను ఒకడిని. ఇక కొన్ని కారణాల వల్ల ఆ పొత్తు జరగలేదు.
అయితే ఈమధ్య ఆయన మీద కొద్దిగా అభిమానానం తగ్గటానికి కారణం పార్టీలకు కర పత్రాలు గా మారిన వార్తా పత్రికల్లో వచ్చిన నిరాధారమైన వార్తలను పట్టుకొని చిరంజీవి ని విమర్శించటం. సరే ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ మధ్య జరిగిన రెండు సంఘటనలు ఆయన గురించి ఆలోచింప జేసేలా చేసాయి.
ఒకటి: ఆయన ఎన్నికల సంఘానికి చెప్పిన ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ సుమారు ఆరు కోట్లు. ఆ ఆస్తుల మార్కెట్ విలువ ఇంకో రెండు మూడు రెట్లు ఉండొచ్చేమో . మరి ఒక ఐఎఎస్ ఆఫీసర్ తన పదవికాలంలో అంత సంపాదించగలడా లేదా అనేది ఆలోచించాల్సిన విషయం. అఫ్కోర్స్, ఆయనకు అది సంక్రమించిన ఆస్తి కూడా అయ్యుండొచ్చు. కాకపోతే దాని గురించి పూర్తీ వివరాలు నాకు తెలీవు కాబట్టి ఈ విషయం నన్ను ఆలోచింప జేసింది.
రెండోది: మూడు కుటుంబాలకు వోట్ వేస్తారో లేక మాకు వోట్ వేస్తారో అని పదే పదే చెప్పే ఆయన, ఆయన భార్య తో కుకట్ పల్లి లో ప్రచారం చేయించు కోవటం.

Monday, April 13, 2009

ప్రరాపా మానిఫెస్టో లో నాకు నచ్చిన అంశం

"గత పదిహేనేళ్లు గా రాష్ట్రం లో జరిగిన అవినీతి పై హై కోర్ట్ జడ్జ్ తో విచారణ". రాష్ట్రం లో గత ఐదు సంవత్సరాలలో విపరీత మైన అవినీతి జరిగింది అని అందరికి తెలుసు. ఇక మన గౌరవమైన ప్రతిపక్ష నాయకుడు చంద్ర బాబు గారు దీని మీద రాష్ట్ర పతి కి కూడా వినతి పత్రం సమర్పించారు. కాని ఆయన పొరపాటున అధికారం లోకి వస్తే మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటారు. ఎందుకంటే ఆయనదీ అదే జాతి కదా. ఆయన హయాం లో కూడా ఆయన మీద చాలా ఆరోపణలు వచ్చాయి. అఫ్కోర్స్, అప్పుడు ఆరోపణలు చేసిన రెడ్డి గారు కూడా అధికారం లోకి వచ్చాక వాటి మీద చర్య తీసుకోలేదు. ఒకప్పటి మిత్రులు కాబట్టి వాళ్లిద్దరి మధ్య అండర్ స్టాండింగ్ మొదటి నుంచి ఉంది అనుకుంటా. 


పిఎస్: బ్లాగు చదివిన వారి కోరిక మేరకు మానిఫెస్టో లింక్ ఇస్తున్నాను.  http://prajarajyam.org/2009/04/09/prajarajyam-manifesto/ 

Friday, April 10, 2009

పరకాల ప్రభాకర్

పరకాల ప్రభాకర్ ప్రజా రాజ్యం లో చేరినప్పుడు ఎన్ని పేపర్లలో హెడ్ లైన్స్ లో రాశాయో తెలీదు కాని ఆయన రాజినామా మాత్రం ప్రజ స్వామ్యం లో అప్రజాస్వామ్యక శక్తులైన ఈనాడు, సాక్షిలు బాగా ఉపయోగించుకున్నాయి. వాళ్ల వాళ్ల పార్టీ లను గద్దె ఎక్కించటానికి ఎంతకైనా తెగిస్తాయి ఈ పత్రికలు.
ఇక అసలు విషయానికి వస్తే, పది నెలల క్రితం అంధ్రా లో ఎవరికి ఈయన పేరు పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. పరకాల ప్రభాకర్ మొదట ప్రజా రాజ్యం లో చేరినప్పుడు ఆయన ఎవరా అని అడిగితే కొంత మందేమో ఆయన ఈ టివి వ్యాఖ్యాత అని కొంత మంది, మేధావి అని కొంత మంది, ప్రజా రాజ్యం లో రామోజీ రావు మనిషి అని ఇలా రక రకాలుగా వినిపించాయి నాకు. ఇక కొన్ని రోజులకు ఎదో లోక్ సభ స్థానాని కి ఆయన పేరు ప్రజా రాజ్యం పరిశీలుస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఈయన పని బాగుందే ఏకంగా లోక్ సభ సీటు నే కొట్టేస్తున్నాడు అనుకున్నాను. తీరా మరి చూస్తే ఆయనకు సీటు రాలేదు. ఇంకేముంది ఏకంగా పార్టీ ని పార్టీ కార్యాలయం లోనే "విషవృక్షం" అనేసాడు. అదే ఆయనకు సీటు వస్తే ఈ "కల్పవృక్షం" అనో లేక "బోధివృక్షం" అనో అనేవాడెమో. విషవృక్షం అని తెలిసిన వాడు వెంటనే రాజీనామా చేయాలి గాని తనకు టికెట్ రానంత వరకు ఎందుకు ఆగాడో ఆయనకే తెలియాలి? మరి ప్రజా విజయభేరి లో చిరు ని పొగిడిన ఆయన ఈ పది రోజుల్లోనే అంత జ్ఞానోదయం ఎలా అయ్యిందో. ఇవన్నీ చుస్తుంటే ఆయన్ను వెరే పార్టీ ల వాళ్లు కావాలనే ప్రజారాజ్యం లోకి పంపించినట్లు అనుమానం కలుగుతుంది. మొత్తానికి ఎవరో అన్నట్లు ఆయన్ను పార్టీ లోకి పంపిన వారి కార్యం ఆయన బాగానే నెరవేర్చినట్లు కనబడుతుంది.