Wednesday, November 4, 2009

రాజకీయంగా ఎదుగుతున్న ప్రరాపా.

కాంగ్రెస్ తో పొత్తు విఫలం కూడా ప్రజారాజ్యానికి ఒకందుకు మంచిదే అయ్యింది. ముందు ముందు పొత్తులకు వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్త లు వహించాలో చెప్పకనే చెప్పింది ఈ పాఠం. పొత్తు విఫలం అవ్వటాన్ని పక్కన పెడితే రాజకీయంగా ప్రరాపా కూడా కొద్దికొద్దిగా ఎదుగుతున్నట్లు కనిపిస్తుంది. ఒకటి కాంగ్రెస్ లాంటి పార్టీ తో పొత్తు చర్చలు జరపటం ద్వారా తెదేపా లాంటి పార్టీల గొంతులో వెలక్కాయ పడినట్లయింది. ఈ రకంగా ప్రరాపా కూడా రాజకీయంగా ఎత్తులు వేయటానికి ప్రయత్నించటం బాగుంది. ఇక్కడ అన్నిటికన్నా పెద్ద కామెడీ ఏంటంటే ఎందుకు పొత్తు పెట్టుకున్నారో ప్రజలకు వివరణ ఇవ్వాలి అని తెదేపా డిమాండ్ చేయటం. మరి వాళ్ళు 2009 ఎన్నికల్లో అప్పటి వరకు బండబూతులు తిట్టుకున్న తెరాస తో పొత్తు పెట్టుకొని జనాలకు ఏమి వివరణ ఇచ్చారో వాళ్లకే తెలియాలి. ఇక పొత్తు లేకుండా ఒక్క ఎన్నికల్లో కూడా బరిలోకి దిగని వామ పక్షాల వాళ్ళు కూడా ఈ విషయం మీద తోక ఊపే వాళ్ళే.
ఈ మధ్య ప్రరాపా లో కనిపిస్తున్న ఇంకో మార్పు ఏంటంటే ఎవరన్నా విమర్శిస్తే వాళ్ల చెంప పగిలేలా సమాధానం చెప్పటం. మొదట్లో ఎవరన్నా విమర్శిస్టే వాళ్ళ పాపానికి వాళ్ళేపోతారు అని ఊరుకొనే వాళ్ళు ప్రరాపా వాళ్లు. ప్రత్యర్ధులందరు టికెట్లు అమ్ముకున్నారు అని అని భారీగా విమర్శించినా దాని మీద పెద్దగా స్పందించకపోవటం వల్ల పార్టీ కి భారీ నష్టమే జరిగింది. ఆ విషయం లేట్ గా అయినా లేటెస్ట్ గా తెలుసుకున్నట్లున్నారు. వామ పక్షాలు పొత్తు మీద విమర్శిస్తే "పొత్తుల్లో చరిత్ర సృష్టించిన మీరు మాట్లాడకుండా ఉంటే మంచింది" అన్నీ వంగా గీత గట్టి సమాధానమే చెప్పింది. తెదేపా వాళ్ళు ఒక చర్చ లో మీరు ఎందుకు విధానాలని మార్చుకొని పొత్తు పెట్టుకుంటున్నారు అని అడిగిన దానికి "సంక్షేమ పధకాలకు వ్యతిరేకం అని చెప్పిన చంద్ర బాబు మనిషికి రెండు వేలు ఇచ్చి రాష్ట్రాన్ని దివాళా తీసే పధకాన్ని తెచ్చి మీ మౌళిక మైన విధానాలనే మార్చుకున్నారు". అలాంటి మీరు మమ్మల్ని మా విధానాలు మార్చుకున్నాము అంటూ అనటం హాస్యాస్పదం అని వాసిరెడ్డి పద్మ సమాధానం బాగుంది.
ఏది ఏమైనా ప్రరాపా కి ఇలా దెబ్బ మీద దెబ్బ తగలటం వల్ల పార్టీ లో కొద్ది కొద్దిగా కసి పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. మరి చూద్దాం ఈ కసి అన్నా పార్టీ ని నిలబెడుతుందో లేదో.

Tuesday, October 20, 2009

'చంద్రు'ని విపణి లో మరో క్షిపణి

ABN ఆంధ్రజ్యోతి వార్తా ఛానెల్ ఒకటి కలిసింది 'ఈ-టీవీ', 'ఈ-టీవీ 2', 'టీవీ 5', 'ఈనాడు', 'ఆంధ్రజ్యోతి', 'సూర్య' ల గుంపుకు . ఈ ఛానెల్ ను ఏకంగా ప్రారంభం నుంచే బాబు కి అంకితం ఇచ్చినట్లున్నారు. ఇన్ని రకాల మీడియా వాళ్ళు అండగా ఉంటే ఏమైనా చేయొచ్చు అనో, లేక ఇంకో ఆయిదేళ్ల తర్వాత అధికారం జలగ లాగా పట్టుకుంటుందనో లేక ఇలాంటి పక్షపాత ధోరణి తో కూడుకొని ఉన్న ఛానెల్స్ చూస్తున్న జనాల అమాయకత్వం చూసో కానీ ఎక్కడ చూసినా బాబే వినూత్నంగా తెగ నవ్వుతూ ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు ఈ ఛానెల్ వెబ్సైట్ లో. మొత్తానికి రాజశేఖరరెడ్డి పోయినప్పటి నుంచి కొత్త ఉత్సాహం వచ్చినట్లుంది బాబు అండ్ కో కి. ఇక సీట్లు ఆశిస్తున్న వాళ్లంతా ఇప్పటినుంచే గాంబ్లింగ్ మొదలు పెడుతున్నారు. ఏదో ఒక రకంగా భవిష్యత్తు లో లాభ పడటానికి ఇప్పటినుంచే బాబు కి సహకరిస్తున్నారు. మరి ఈ ఛానెల్ ప్రారంభం వెనుక ఎలాంటి మతలబులున్నాయో. సాక్షి కి ఈనాడు అండ్ కో కి తేడా ఏంటంటే ఒకడు దొంగ రూపం లో ఉన్న దొంగ, ఇంకొకడు మంచి వాడి రూపంలో ఉన్న దొంగ. దీనిలో రెండో వాడి వల్లే నష్టం ఎక్కువ. కొత్త ఛానెల్ కానీ వార్తా పత్రిక గాని వస్తుంటే ఏ పార్టీ వారిదో ఆ ఛానెల్ అని అడగాల్సి వస్తుంది చివరికి.
సరే ఇవన్నీ ఎప్పుడూ ఉండేవేలే కానీ, ఇన్ని తెలుగు న్యూస్ ఛానెల్స్ వల్ల తెలుగు వచ్చిన వారికి కొత్త ఉద్యోగావకాశాలు ఏర్పడుతున్నాయి కాబట్టి వీళ్లకి నా అభినందనలు.

Tuesday, September 22, 2009

మగధీర కొత్త సన్ని వేశాల తర్వాత ...

కొత్త సీన్స్ ఏంటి?

- శ్రీహరి, చరణ్ కలిసి ఉదయ్గఢ్ వెళ్లి రాకుమారిని తప్పించే ప్లాన్స్ వేయటం, మధ్యలో విలంతో ఒక చిన్న ఫైఠ్, ఘోరా తో ఒక చిన్న సన్నివేశం.

సినిమా కి వాటి అవసరం ఏంటి?

-ఆ సీన్స్ లేకమునుపు చరణ్ ఉదయగఢ్ వెళ్లాక చివరి సీన్ లో అకస్మాత్తుగా స్రీహరి కనిపించటం కొద్దిగ కంటిన్యుటీ లేనట్లు గా అనిపించింది. ఆ కొత్త సీన్స్ కలిపాక కొంచెం కంటిన్యుటీ పెరిగింది.

కొత్త సన్నివేశాలు ఎలా ఉన్నాయి?

- ఎక్కువ శాతం హెలికాప్టర్ ని జీపు గుద్దే సన్నివేశం తో పోలి ఉన్నాయి. అంటే అవి చూడగానె కొద్దిగా నవ్వొచ్చే విధంగా ఉన్నాయి. ఇంకొ రకంగా చెప్పాలంటే అరవ సినిమా లో ఫైట్లలాగా ఉన్నాయి కొద్దిగా.

కొత్త సన్నివేశాల కోసం మగధీర మళ్లీ చూడాలా?

-అవసరం లేదు

Thursday, August 20, 2009

తెలుగుదేశం - ఈనాడు - ఆంధ్రజ్యోతి

ఈ పోస్ట్ లో ఎ2జెడ్ అన్నట్లు తొమ్మిది సంవత్సరాలు అధికారం లో ఉండి ఈ పనులు మేము చేశాం కాబాట్టి మమ్మల్ని గెలిపించండి అని అనాల్సింది పోయి పూర్తిగా కాంగ్రెస్ వ్యతిరేక వోటు మీద ఆధారపడి చిన్న పార్టీలకు వోటు వేయటం వృధా అంటూ చివరికి ఒక సీటు మాత్రమే గెలుచుకున్న లోక్సత్తా మీద కూడా ఏడవటం చాలా ఛండాలంగా ఉంది.

ఒక పక్క ప్రభుత్వం ఆపరేషన్ "ఆకర్ష్" ప్రవేశ పెట్టింది అంటూ తన రెండు పత్రికలలో గగ్గోలు పెట్టిస్తూ ఇటు పక్క "ప్రజారాజ్యం" లో ఉన్న పాత తెదేపా నేతలందరితోటి ఫోన్ లలో సంప్రదించి పార్టీలోకి రావాలని ఆహ్వానించటం, నేతలు ఎవరు తిరిగి వచ్చినా పూర్వ గౌరవం ఇస్తాం అని పబ్లిక్ గా ప్రకటనలు ఇవ్వటం ఆ పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనం.

అసెంబ్లీ లో ఎప్పుడు చూసినా నువ్వంత తిన్నావు, నువ్వు ఇంత తిన్నావు, నువ్వో పెద్ద ఫాక్షనిస్ట్ వి అంటూ వ్యక్తిగత విమర్శలే కాని, సరిగ్గా సమస్యల గురించి గత ఇదేళ్లలో చేసింది చాలా తక్కువ. కొత్తగా అసెంబ్లీ లో అడుగు పెట్టిన చిరంజీవి, జెపి లను చూసి కూడా వీళ్లకు బుద్ధి రావట్లేదు. మాట్లాడితే వాకౌట్ లేక పోతే నిరసనలు తప్పితే సమస్యలు పట్టవు. డే 1 నుంచి కాంగ్రెస్ ఏది చేసినా వీళ్లకు తప్పే. మాట్లాడితే కాంగ్రెస్ ది సాంకేతిక గెలుపు మాత్రమే, మేం ఓడిపోయి గెలిచాం, వాళ్లు గెలిచి ఓడిపోయారు అనటం బాబు మూర్ఖత్వానికి నిదర్శనం. 64 శాతం మంది కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వేశారు అంటాడే కాని 70 శాతం మంది తెలుగు దేశానికి వ్యతిరేకంగా ఉన్న సంగతి మాత్రం ఆయనకు అనవసరం.

ఇక వీళ్లేం చేసినా వంత పాడటానికి ఒక రెండు వెధవ పత్రికలున్నాయి. నేను అనుకోవటం రామోజీ రావు, బాబు, రాధా కృష్ణ ల మధ్య రోజు కాంఫరెన్స్ జరుగుతుందేమో. ముగ్గురు కలిసి ఒక సమయం లో ఒకే ఒక వార్త ని బలంగా ప్రజల మీద రుద్దతానికి ప్రయత్నిస్తారు. నెల రోజుల క్రితం ఆపరేషన్ "ఆకర్ష్" అని ప్రభుత్వం మీద పడ్డాయి. కొన్ని రోజుల తర్వాత లోక్సత్తా పార్టీ మీద ఏడ్చాయి. ఇప్పుడు తాజాగా ప్రజా రాజ్యం మీద పడ్డాయి. ప్రజా రాజ్యం లో నాయకులు ఆనందంగానే ఉన్నా వాళ్లు పార్టీ మారాలనుకుంటున్నారు, వీళ్లు మారాలనుకుంటున్నారు అంటూ వార్తలు రాసి వాళ్లు నిజం గా తెదేపా లో చేరేటట్లు చేయటం ఈ ఆపరేషన్ లక్ష్యం. వాస్తవానికి ప్రజా రాజ్యం వల్ల తెలుగు దేశం కు ఎంత నష్టం జరిగిందో కాంగ్రెస్ కూడా అంతే నష్టం జరిగింది. కాని ఈ ముగ్గురు పని గట్టుకొని కాంగ్రెస్ కి ప్రజా రాజ్యం వల్ల లాభం అంటూ ఒకే సారి ఊదరగొడుతూ ప్రభుత్వ వ్యతిరేక వోటు పొందాలని చూస్తున్నారు. చిరంజీవి ని కాంగ్రెస్ కు ఎంత దగ్గరగా చూపిస్తే వీళ్లకు అంత లాభం అని వీళ్ల ఉద్దేశం. ఇవ్వాళ ఈనాడు లో వచ్చిన వార్తే దీనికి నిదర్శనం.

ఒక ప్రధాన ప్రతిపక్షం హోదాలో ఉండి కరువు, ధరల పెరుగుదల, కేంద్రం లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, బెల్ట్ షాపులు, విపరీతంగా ఫీజుల పెంపకం, అధ్వాన్నమైన రోడ్లు, మంచి నీటి సమస్య, ప్రభుత్వ స్థలాల అమ్మకం ఇలాంటి సమస్యల పై అసెంబ్లీ లో పోరాడకుండా అసెంబ్లీ బయట ఇలా మీడియా తో కుమ్మక్కై దొంగ రాజకీయాలు చేయటం దారుణ మైన విషయం.

రెండు ప్రముఖ దినపత్రికలు అయ్యుండి ప్రజలకు నిజా నిజాలు అందించాల్సింది పోయి ఒక రాజకీయ పార్టీ కి అండగా చేరి ప్రజలను మభ్య పెట్టడం దారుణాతి దారుణం.

Wednesday, July 15, 2009

దుర్గాబాయి దేశ్ ముఖ్

ఇవ్వాళ ఏదో ఇంగ్లీష్ పేపర్ తిరగేస్తుంటే ఇవ్వాళ దుర్గాబాయి దేశ్ ముఖ్ పుట్టిన రోజు అని ఆమె మీద మంచి వ్యాసం రాసి ఉంది. చిన్నప్పుడు ఆమె పేరు మీద ఉపవాచకం చదివినట్లు గుర్తు ఉంది కాని, అంతకు మించి పెద్దగా గుర్తు లేదు. మన రాష్ట్రానికి చెందిన అందులోను ఒక మహిళ జాతీయ స్థాయిలో అన్ని విజయాలు సాధించి అంతటి పేరు ప్రతిష్టలు పొందటం నిజంగానే అరుదు. ఇక మన ఘనత వహించిన ముఖ్యమంత్రి గారికి ఏ పధకం పెట్టినా ఇందిర, రాజీవ్ ల పేర్లు తప్ప ఇలాంటి గొప్ప వాళ్ల అందులో మన తెలుగు వాళ్ల పేర్లు అసలే గుర్తు రావు. సరే ఆయన సంగతి వదిలేస్తే తెలుగు మహిళ అని, మహిళా రాజ్యం అని, పేర్లు పెట్టుకొని బూతులు తిట్టుకోవటం తప్పితే ప్రతిపక్షాల మహిళా విభాగాలు ఎందుకు పనికి రావు. ఇక మన పత్రికలైన ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి లలో కనిసం ఆవిడ పుట్టిన రోజు అని ఒక మూల కూడా రాసినట్లు లేవు. ఒక్క అంధ్రప్రభ లో మాత్రం చక్కగా దీని మీద ఒక చిన్న వ్యాసం ప్రచురించారు.

Friday, June 19, 2009

నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా తీరుగా మైక్రోసాఫ్ట్, గూగుల్ పోరు

చిన్నప్పుడు కధల్లో చదువుకున్న ఈ సన్నివేశం ఇప్పుడు ఈ రెండు సాఫ్ట్వేర్ వీరుల మధ్య జరుగుతున్నట్లుంది. ఎవరైనా నెట్ లో ఏదన్నావెతకాలంటే చటుక్కున గుర్తొచ్చేది గూగుల్. సెర్చ్ కి అంత మార్కెట్ ఉంటుంది అని కనిపెట్టి దానికి కావాల్సిన అల్గారిథంస్ రాసి ఎంతో మంది కి డ్రీం కంపనీ అయింది గూగుల్. ఇక పోతే మెయిన్ ఫ్రేం కంప్యుటర్ లు రాజ్యమేలుతున్న రోజుల్లో వ్యక్తి గత పిసి లకు భవిష్యత్తు లో ఉండబోయే మార్కెట్ ను అంచనా వేసి దానికి తగ్గ ఆపరేటింగ్ సిస్టం తయారు చేసి ప్రపంచం లోనే అతి పెద్ద సాఫ్ట్వేర్ కంపనీ గా తయారయ్యింది మైక్రోసాఫ్ట్.

ఇక పొతే నిన్న గాక మొన్న వచ్చిన గూగుల్ ఒక్క సెర్చ్ అనే ఫీచర్ తోనే ఆన్ లైన్ ప్రకటనల తో కోట్లు గడిస్తుండటం తో ఎక్కడో మైక్రోసాఫ్ట్ కి కన్ను కుట్టింది. దానికి తోడు గూగుల్ సెర్చ్ నుంచి తన పరిధిని విస్తరించుకుంటూ చిన్నగా మైక్రోసాఫ్ట్ కి బాగా బలమున్న డెస్క్ టాప్ ఏరియా లో అదుగు పెట్టి దానికి బ్రెడ్ అండ్ బటర్ అయిన ఆఫీస్ లాంటి మీదే గురి పెట్టి చిన్నగా అప్పటిదాకా ఎదురే లేదనుకున్న మైక్రోసాఫ్ట్ కే పోటీదారు గా మారింది. దీంతో మైక్రోసాఫ్ట్ కు పుండు మీద కారం చల్లినట్లు అయింది. "మన పరిధిని మనము పెంచుకొంటూ పోకపోతే అందరూ పోటిదార్లు కలిసి తలా ఒక పక్కనుంచి వచ్చి మనల్ని ప్రెస్ చేసి మనకు ఒక పరిధి అంటూ లేకుండా చేస్తారు" అన్న సిద్ధాంతాన్ని చరిత్రను చూసి అవగతం చేసుకున్న మైక్రోసాఫ్ట్, గూగుల్ కుంభ స్థలాన్నే కొట్టడానికి నిర్ణయించుకుంది. నా బంగారు పుట్టలో ఏలు పెడితే నేను కుట్టనా అంటూ గూగుల్ కి పోటీ గా జూన్ నెలలో "బింగ్" అనే కొత్తసాఫ్ట్ వేర్ ని విడుదల చేసింది. సెర్చ్ తో ఆగకుండా ఒక అడుగు ముందుకేసి "డెసిషన్ ఇంజన్" అనే కొత్త మార్కెటింగ్ అంశం తో ముందుకొచ్చింది. దాని పనితనం కూడా మైక్రోసాఫ్ట్ నుంచి ఆశించిన దాని కన్నా మిన్నగా ఉండటంతో నిపుణులు కూడా ఇప్పటికిప్పుడు గూగుల్ స్థానానికి వచ్చ్హే నష్టం ఎమీ లేకపోయినా ఇక మీద గూగుల్ పని నల్లేరు మీద నడక కాదు అని భావిస్తున్నారు. గూగుల్ కూడా ఈ హఠాత్పరిణామాన్ని ఎదుర్కోవటానికి దాని స్థాపించిన వారిలో ఒకరైన సర్గీ బ్రిన్ ఆధ్వర్యంలో ఒక టీం ని ఏర్పాటు చేసింది అని వినికిడి. అయితే మిగతా వీక్షకులు మాత్రం ముందు ముందు ఈ కొత్త పరిణామం ఈ రెండు యోధుల మధ్య పోటీని భవిష్యత్తు లో ఇంకా తీవ్రంగా, ఆసక్తికరంగా మారుస్తుంది అంటున్నారు.
చూద్దాం ఈ పోటీలో ఎవరు గెలుస్తారో.

Monday, May 18, 2009

ప్రజా రాజ్యం తుస్సు మన్నదా?

ఒక రెండు మూడు రోజుల్నుంచి ఈనాడు లాంటి విష పత్రికల వాళ్లు, మన బ్లాగు సోదరులు అందరు ప్రజా రాజ్యం తుస్సు మంది అనో ఘోరం గా ఓడింది అని అంటున్నారు. అలా అనటం ఎంత వరకు సమంజసం? 
1) ప్రజా రాజ్యానికి వచిన సీట్లు 18, వోట్ల శాతం సుమారు 16. 130 సంవత్సరాల నుంచి ఉన్న పార్టీ  కి  36% వోట్లు వస్తే, 30 ఏళ్ల నుంచి ఉన్న పార్టీ కీ 26% వస్తే, 8 నెలలున్న పార్టీ కి 16% శాతం వోట్లు వచ్చాయి. ఇది విజయం కాదా?. 
2) ఒక వేళ శాతం ప్రకారం సీట్లు వచ్చి ఉంటే కాంగ్రెస్ కి సుమారు 100, తెదేపా కి 75, ప్రరాపా కి 50 వరకు వచ్చి ఉండేవి. ఎనిమిది నెలలు వయసు ఉన్న పార్టీ కి ఇంత స్పందన రావటం తుస్సుమన్నట్లా?    
3) వై యెస్ ఇదేళ్లలో, బాబు 9 ఏళ్లలో వాళ్ల వాళ్ల పాలన ఎంటొ ప్రజలకు చూపించారు. వాళ్లకి వోట్లు వేసిన వాళ్లు ఆ పనులని చూసి వోట్ వేసుంటారు ఆయా పార్టీలకు. కాని ఇంత వరకు రాజకీయాల్లోనే లేని ఒక వ్యక్తి కి 16 శాతం వోట్లు రావటం, ముక్కోణపు పోటి లో ఒక్కరితోను పొత్తు లేకుండా తర తరాల నుంది ఉన్న పార్టీ లను ఖంగు తినిపించి 18 సీట్లు గెలుచుకోవటం వోటమి అవుతుందా?   
4) ఈనాడు, సాక్షి లాంటి విలువల్లేని వార్తా పత్రికలు చిరు పార్టీ పెట్టక ముందు నుంచి చేసిన నెగిటివ్ ప్రచారాన్ని తట్టుకొని, ఎన్నికలు ఇంకో పది రోజులు ఉందనగా పరకాల లాంటి వాళ్ల తో ఆడించిన డ్రామాలను  తట్టుకొని అన్ని సీట్లు సాధించటం ఏ రకంగా వోటమి? ఇప్పుడు ఇలా అనే పత్రికలలో ఒక్కళ్లు కూడా ఎన్నికల ముందు చేసిన విశ్లేషణలలో ప్రజా రాజ్యానికి 40 కన్నా సీట్లు వస్తాయని రాయలేదు. ఇప్పుడు మాత్రం తుస్సు, బర్రు అంటారు.
5) ఒక వేళ వై యెస్ గాని, చంద్ర బాబు కాని వాళ్ల పార్టీ లను వదిలి కొత్త పార్టీ ని పెట్టి వాళ్ల వాళ్ల వ్యక్తి గత బలాల మీద 16% వోట్లు సాధించే దమ్ము ఉందా? అసలు వాళ్లకే కాదు మన రాష్ట్రం లో ఎవరికైనా ఉందా? వాళ్లకు వచ్చే వోట్ల లో సిం హ  భాగం వోట్లు ఆయా పార్టీలను తరతరాలుగా వెన్నంటి ఉన్న ప్రజలవి. ఇలా సొంత బలమే పార్టీ బలంగా వచ్చిన వ్యక్తి 18 సీట్లు సాధించాడు.
6) ఒకప్పుడు రామారావు పార్టీ పెట్టటం తోనే అధికారం లోకి వచ్చాడు. కాని అప్పుడున్నట్లు రాజకీయ శూన్యత, ప్రభుత్వ వ్యతిరేకత ఇప్పుడు లేవు. అవి లేక పోగా విలువల్లేని మీడియా, దబ్బు ప్రభావం ఇలాంటివి దాపురించాయి. ఇవన్ని మన పత్రికలకు చిరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు  రాశారు కూడా. వీటిని తట్టుకొని పార్టీ 18 స్థానాల్లో మొదటి స్థానం లో, 34 స్థానాల్లో రెండో స్థానాల్లో నిలిచింది. ఇది ముమ్మాటికీ గొప్పే. అయితే 230 స్థానాల్లో ముడో స్థానం లో ఉంది అని రాశారు మన "largest circulated daily of AP (that circulates largest number lies daily) " వారు.  
 పార్టీ పెట్టగానే 200 సీట్లు వస్తాయనుకోవటం అతిశయోక్తే అవుతుంది. ఈ మంచి ప్రారంభాన్ని పార్టీ మరింత బలోపేతం చేయటానికి వాడుకుంటారు అని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.