సమైక్యరాష్ట్రం కోరుకొనే వాళ్ళు తెలంగాణ ద్రోహులు కాదు. రాష్ట్రం లో ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. తెలంగాణ ప్రజలలో కూడా సమైక్యం కోరుకొనే వాళ్ళు ఉన్నారు.
ద్రోహి అంటే పైకి ఒకటి చెప్తూ వెనకాల వెన్నుపోటు పొడిచే వారు.
ఉదా:
1) తెలంగాణ తెచ్చేది ఇచ్చేది కాంగ్రెస్సే అని తెలంగాణ లో చెప్తూ తెలంగాణ ను అడ్డుపెట్టుకొని పెద్ద పెద్ద పదవులను కొట్టేసి తెలంగాణా కి పైసా పని చేయని కాంగ్రెస్ సీనియర్ నాయకులు తెలంగాణ ద్రోహులు.
2) తెలంగాణ కు అనుకూలం అని చెప్తూ సీమాంధ్ర లో నిరాహార దీక్షలు, బస్సు యాత్రలు చేయించి అక్కదేమో సమైక్యం అని, ఇక్కడేమో జై తెలంగాణా అని రెండు ప్రాంతాల ప్రజలను మభ్య పెడుతున్న తెలుగుదేశం రెండు ప్రాంతాల ద్రోహి
౩) అదుగో తెలంగాణ, ఇదిగో తెలంగాణా అంటూ ఉద్యమం పేరు చెప్పుకొని డబ్బులు గుంజుకుంటూ, సొంత నియోజక వర్గం లో వరదలు వచ్చి అంతా పోతే కనీసం ఏమీ చేయకుండా...దోపిడీ దారులు, వలస వాదులు, ఉద్యోగాలు, వివక్ష, వెనకబాటుతనం అంటూ రెచ్చగొట్టుడు ప్రసంగాలు చేసి అమాయక విద్యార్ధుల ప్రాణాలు బలి దీసుకొని, చివరికి శ్రీకృష్ణ కమిటీ దగ్గర స్వయంపాలన అంటూ మాట మార్చి, సమ్మగా ఇప్పుడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం కోసం మీటింగులు పెట్టుకుంటున్న kcr/TRS తెలుగు ప్రజల అతి పెద్ద ద్రోహి.
వీళ్లందరు చేసిన ఏ ఒక్క దుర్మార్గపు పని చిరంజీవి చేయలేదు. తన నిర్ణయం మార్చుకున్నాడు తప్ప, నిర్ణయం మార్చుకోలేదు అని చెపుతూ రెండు ప్రాంతాలు, రెండు నాల్కలు, రెండు కళ్ళు అని వేదాలు వల్లే వేయట్లేదు.
చివరిగా: చిరంజీవి కి సమైక్యంగా ఉండాలంటు తెలంగాణ లో పర్యటించే అన్నీ హక్కులు ఉన్నాయి. Really looking forward to it.