Wednesday, April 15, 2009

నేనూ వోట్ వేస్తున్నానోచ్!

చిన్నప్పుడు ఎప్పుడో ఎన్నికలు జరిగేటప్పుడు మా అమ్మ తో పోలింగ్ బూత్ లోకి వెళ్లి నేను కూడా చుక్క పెట్టించుకొని బడి లో అందరి దగ్గర ఫోస్ కొట్టేవాడిని వోట్ వేశానని చెప్పి. కొంచెం పెద్ద అయినప్పటినుంచి ఎప్పుడూ ఇంకా ఆ జోలికి పోలేదు. ఇంక చదువు అయ్యాక డిల్లీ లో ఒక ఆరేళ్లు ఉన్నా ఎప్పుడూ వోట్ కి దరఖాస్తు చేయలేదు. ఇక ఈ సారి ఎన్నికలు ఈ మధ్య వచ్చిన కొత్త పార్టీ ల వల్ల చాలా రంజు గా మారాయి. ఎందుకంటే ప్రధాన పార్టీల రేఖలు వాళ్ల బలం మీదే కాకుందా వాళ్ల నుంచి కొత్త పార్టీలకు చీలే వోట్ల మీద కూడా ఆధారపడి ఉన్నాయి. సరే ఏది ఏమైనా ఈమధ్యే నేను హైదరాబాదు రావటం, రాగానే వోట్ కి అప్లయి చేయటం, చేసిన ఇరవై రోజుల్లోనే అది రావటం అన్ని చక చకా జరిగిపోయాయి. మొత్తానికి మొదటి సారి వోట్ వేయబోతున్నాను కాబట్టి  చాలా అనందం గా ఉంది.  
నాలాగే మొదటి సారి వొటు హక్కు ఉపయోగించుకుంటున్న అందరికి శుభాకాంక్షలు, అభినందనలు, విజయం ప్రాప్తిరస్థు.

ఒక ప్రరాపా ప్రెజెంటేషన్

నెట్ లో అవినీతి మీద  రూపొందించిన ప్రజారాజ్యం ప్రెజెంటేషన్ ఒకటి దొరికింది. వీలుంటే చూడండి.  http://www.slideshare.net/PrajaRajyam/anti-corruption

Tuesday, April 14, 2009

లోక్ సత్తా లో నన్ను ఆలోచింప జేసిన విషయాలు

అందరిలాగానే నేను కూడా జెపి గారి ఇంటర్వ్యూ లు, ప్రసంగాలు చూసి ఆయన అభిమానిని అయ్యాను. ప్రజారాజ్యం ఆవిర్భవించినప్పుడు చిరంజీవి లోక్సత్తా తో పొట్టు పెట్టుకుంటే బాగుండు అని అనుకున్న వాళ్ళలో నేను ఒకడిని. ఇక కొన్ని కారణాల వల్ల ఆ పొత్తు జరగలేదు.
అయితే ఈమధ్య ఆయన మీద కొద్దిగా అభిమానానం తగ్గటానికి కారణం పార్టీలకు కర పత్రాలు గా మారిన వార్తా పత్రికల్లో వచ్చిన నిరాధారమైన వార్తలను పట్టుకొని చిరంజీవి ని విమర్శించటం. సరే ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ మధ్య జరిగిన రెండు సంఘటనలు ఆయన గురించి ఆలోచింప జేసేలా చేసాయి.
ఒకటి: ఆయన ఎన్నికల సంఘానికి చెప్పిన ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ సుమారు ఆరు కోట్లు. ఆ ఆస్తుల మార్కెట్ విలువ ఇంకో రెండు మూడు రెట్లు ఉండొచ్చేమో . మరి ఒక ఐఎఎస్ ఆఫీసర్ తన పదవికాలంలో అంత సంపాదించగలడా లేదా అనేది ఆలోచించాల్సిన విషయం. అఫ్కోర్స్, ఆయనకు అది సంక్రమించిన ఆస్తి కూడా అయ్యుండొచ్చు. కాకపోతే దాని గురించి పూర్తీ వివరాలు నాకు తెలీవు కాబట్టి ఈ విషయం నన్ను ఆలోచింప జేసింది.
రెండోది: మూడు కుటుంబాలకు వోట్ వేస్తారో లేక మాకు వోట్ వేస్తారో అని పదే పదే చెప్పే ఆయన, ఆయన భార్య తో కుకట్ పల్లి లో ప్రచారం చేయించు కోవటం.

Monday, April 13, 2009

ప్రరాపా మానిఫెస్టో లో నాకు నచ్చిన అంశం

"గత పదిహేనేళ్లు గా రాష్ట్రం లో జరిగిన అవినీతి పై హై కోర్ట్ జడ్జ్ తో విచారణ". రాష్ట్రం లో గత ఐదు సంవత్సరాలలో విపరీత మైన అవినీతి జరిగింది అని అందరికి తెలుసు. ఇక మన గౌరవమైన ప్రతిపక్ష నాయకుడు చంద్ర బాబు గారు దీని మీద రాష్ట్ర పతి కి కూడా వినతి పత్రం సమర్పించారు. కాని ఆయన పొరపాటున అధికారం లోకి వస్తే మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటారు. ఎందుకంటే ఆయనదీ అదే జాతి కదా. ఆయన హయాం లో కూడా ఆయన మీద చాలా ఆరోపణలు వచ్చాయి. అఫ్కోర్స్, అప్పుడు ఆరోపణలు చేసిన రెడ్డి గారు కూడా అధికారం లోకి వచ్చాక వాటి మీద చర్య తీసుకోలేదు. ఒకప్పటి మిత్రులు కాబట్టి వాళ్లిద్దరి మధ్య అండర్ స్టాండింగ్ మొదటి నుంచి ఉంది అనుకుంటా. 


పిఎస్: బ్లాగు చదివిన వారి కోరిక మేరకు మానిఫెస్టో లింక్ ఇస్తున్నాను.  http://prajarajyam.org/2009/04/09/prajarajyam-manifesto/ 

Friday, April 10, 2009

పరకాల ప్రభాకర్

పరకాల ప్రభాకర్ ప్రజా రాజ్యం లో చేరినప్పుడు ఎన్ని పేపర్లలో హెడ్ లైన్స్ లో రాశాయో తెలీదు కాని ఆయన రాజినామా మాత్రం ప్రజ స్వామ్యం లో అప్రజాస్వామ్యక శక్తులైన ఈనాడు, సాక్షిలు బాగా ఉపయోగించుకున్నాయి. వాళ్ల వాళ్ల పార్టీ లను గద్దె ఎక్కించటానికి ఎంతకైనా తెగిస్తాయి ఈ పత్రికలు.
ఇక అసలు విషయానికి వస్తే, పది నెలల క్రితం అంధ్రా లో ఎవరికి ఈయన పేరు పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. పరకాల ప్రభాకర్ మొదట ప్రజా రాజ్యం లో చేరినప్పుడు ఆయన ఎవరా అని అడిగితే కొంత మందేమో ఆయన ఈ టివి వ్యాఖ్యాత అని కొంత మంది, మేధావి అని కొంత మంది, ప్రజా రాజ్యం లో రామోజీ రావు మనిషి అని ఇలా రక రకాలుగా వినిపించాయి నాకు. ఇక కొన్ని రోజులకు ఎదో లోక్ సభ స్థానాని కి ఆయన పేరు ప్రజా రాజ్యం పరిశీలుస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఈయన పని బాగుందే ఏకంగా లోక్ సభ సీటు నే కొట్టేస్తున్నాడు అనుకున్నాను. తీరా మరి చూస్తే ఆయనకు సీటు రాలేదు. ఇంకేముంది ఏకంగా పార్టీ ని పార్టీ కార్యాలయం లోనే "విషవృక్షం" అనేసాడు. అదే ఆయనకు సీటు వస్తే ఈ "కల్పవృక్షం" అనో లేక "బోధివృక్షం" అనో అనేవాడెమో. విషవృక్షం అని తెలిసిన వాడు వెంటనే రాజీనామా చేయాలి గాని తనకు టికెట్ రానంత వరకు ఎందుకు ఆగాడో ఆయనకే తెలియాలి? మరి ప్రజా విజయభేరి లో చిరు ని పొగిడిన ఆయన ఈ పది రోజుల్లోనే అంత జ్ఞానోదయం ఎలా అయ్యిందో. ఇవన్నీ చుస్తుంటే ఆయన్ను వెరే పార్టీ ల వాళ్లు కావాలనే ప్రజారాజ్యం లోకి పంపించినట్లు అనుమానం కలుగుతుంది. మొత్తానికి ఎవరో అన్నట్లు ఆయన్ను పార్టీ లోకి పంపిన వారి కార్యం ఆయన బాగానే నెరవేర్చినట్లు కనబడుతుంది.

Wednesday, March 18, 2009

'మెగాస్టార్' ఈ ఇబ్బందులను అధిగమించగలడా?

దాదాపు గా ఒక ఇరవై ఏళ్ళు గా సినిమా రంగం లో రారాజు చిరంజీవి. అట్టడుగు స్థాయి నుంచి అత్యంత ఎత్తుకి ఎదిగాడు తన పట్టుదల, కృషి తో. కోట్లల్లో అభిమానులను సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఆ అభిమానమే ఆస్తి గా రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు. పార్టీ ఏర్పడిన మొదట్లో అంతా సజావుగానే జరిగినా గత కొద్ది కాలంగా ఎక్కువగా 'చిరు' కి రాజకీయం ఎంత కుట్ర కుతంత్రాలతో కూడిందో అర్థం అవుతూ ఉండి ఉంటుంది. సినిమాల్లో అరంగేట్రం చేసినప్పుడు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయో తేలేదు కాని, ఇప్పుడు మాత్రం చాలా ఎదురు దెబ్బలు, ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఇందులో మొదటిది, అతి ముఖ్యమైన ఇబ్బంది వార్తా పతికలు, మీడియా మద్దతు లేకపోవటం. వాళ్ల మద్దతు లేక పోగా ఏదో ఒక రకంగా చిరు పేరుని మాత్రం వాళ్ల స్వార్ధాలకోసం వాడుకుంటున్నారు. వాట్లో మొదటగా చెప్పాల్సింది 'ఈనాడు' గురించి. ఎప్పుడైతే సాక్షి తక్కువ డబ్బులతో ఎక్కువ ఫీచర్స్ ఇచ్చి ఈనాడు సర్కులేషన్ తగ్గించిందో అప్పుడు ఈనాడు కి అప్పుడప్పుడే రాజాకియాల్లోకి దూసుకు వస్తున్న చిరంజీవి ఒక బ్రహ్మాస్త్రంలా కనిపించాడు. అదే తడుముగా తన చిరకాల మిత్రుడైన రాముడి పార్టీ ని పక్కన పెట్టి, ఆంజనేయుడి పార్టీ కి ఒక రేంజ్ లో మద్దతు పలికాడు. అది ఎంత వరకు వెళ్లిందంటే చిరు వేసుకున్న చొక్కా రంగు నుంచి, పెట్టుకున్న వాచ్ నుంచి, మొహం మీద ఎంత శాతం చిరునవ్వు ఉందో, ఎన్ని గంటల ఎన్ని సెకన్ల ఎన్ని మిల్లీ సెకన్లకి ఉపన్యాసం ఇచ్చాడో అన్నిటినీ వర్ణిస్తూ కథనాలు రాయసాగాడు. అలా అభిమానులను ఈనాడు చదివించేలా ఆకట్టుకొని తన కష్ట సమయాల్లో గట్టెక్కాడు. ఎప్పుడైతే సాక్షి సర్కులేషన్ తగ్గటం మొదలు పెట్టిందో మళ్లీ చిరు ని పక్కన పెట్టి ఎప్పటిలాగానే తెదేపా ని అందలం ఎక్కించటం మొదలు పెట్టాడు. ఇక ఇప్పుడు చిరు గురించి ఈనాడు లో ఎక్కువగా రాసే అంశాలు "ప్రరాపా కమిటీ మీటింగ్ లో కార్యకర్తలు కొట్టుకున్నారు" అనో లేక ప్రరాపా అజెండా గురించి ఎవరో చేసిన విమర్శనో రాస్తాడు. మంచి విషయాలని ఏ మూలో ఎవరూ చదవని పేజీ లో రాస్తాడు. ఇక సాక్షి విషయానికి వస్తే మొదటి నుంచి ఒకే తీరు: కాంగ్రెస్స్ని తప్ప మిగతా పార్టీ లను విమర్శించటమే. మొదట చిరు ని విమర్శిస్తే అభిమానులు ఎలా స్పందిస్తారో తెలుసుకోవటానికి "పొలిటికల్ గాసిప్' 'కాలం' లో అన్నీ చిరు గురించి నెగెటివ్ గా రాసేవాడు. చిన్నగా అభిమానులు ఆ విమర్శలకు సెట్ అయ్యాక అవే ముఖ్య వార్తల్లో రాయటం మొదలు పెట్టాడు. ఇక అంధ్రజ్యోతి, వార్త, సూర్య కి కూడా వాటి వాటి పార్టీలు ఉండనే ఉన్నాయి. ఇలా చిరు కి యే ఒక్క పత్రిక మద్దతు కూడా లేదు.
ఇక టీవీల విషయానికి వస్తే వీళ్లకి కావల్సింది సెన్సేషనల్ న్యూస్ మాత్రమే, నిజానిజాలు ఎంత మాత్రం కావు. రోజా, జీవిత, రాజశేఖర్ వీళ్ల పాలిట దేవుళ్లు. వాళ్లు యే చౌక బారు విమర్శ చేసినా "ఫ్లాష్...ఫ్లాష్..." అంటూ రోలర్స్ వేస్తారు. ఆ రోజంతా వాళ్లందరి తోటి పదే పదే ఇంటర్వ్యూ లు పెట్టి, వింత వింత చర్చలు పెట్టి పండగ చేసుకుంటారు. మనకు తెలియకుండానే చిరంజీవి గురించి నెగెటివ్ అభిప్రాయం వచ్చేలా చేస్తారు. టీవీ 9/5, ఎన్ టీవీ ఈ కోవ లోకి వస్తాయి.
ఇక పోతే మిగతా పార్టీ ల రాజకీయ నాయకులు: వీళ్లకి కావల్సింది ఎదో ఒక విధంగా ఆయా పార్టీల అధినేత కళ్లల్లో పడటం, పార్టీలో తమ స్థాయిని పెంచుకోవటం. ఇక వీళ్లకి కూడా ఆయుధం చిరంజీవే. చిరంజీవి ని "శని నాయకుడు" అనో లేక పోతే బ్లడ్ బాంక్ లో రక్తం అమ్ముకున్నాడనో అంటేనే వీళ్ల పేర్లు పత్రికల్లో వస్తాయి, ముఖాలు టీవీల్లో కనిపిస్తాయి. రోజా, మారెప్ప లాంటి వాళ్లు ఈ కోవ కి చెందిన వాళ్లు. పదే పదే ఒకళ్లనే లక్ష్యం గా చేసుకొని విమర్శించి అవతలి వాళ్లని రెచ్చగొట్టటం వీళ్ల ఏకైక లక్ష్యం.
ఇక "ప్రరాపా" లో టికెట్ ఆశించి చేరేవాళ్లది ఇంకో కోవ. టికెట్ రాదు అని కన్ ఫర్మ్ అయ్యాక "ప్రజా రాజ్యం లో సామాజిక న్యాయం జరగట్లేదు" అనో లేక "టికెట్ కి దబ్బులు అడుగుతున్నాడు" అనో ఒక విలేఖరుల సమావేశం పెడతారు. అన్ని టీవీ చానెల్స్ దాన్ని లైవ్ ప్రసారం చేస్తాయి. వీళ్లందరూ కాక కోవర్టులు ఇంకా ఉండనే ఉన్నారు.
ఇక అభిమానులు కూడా చిరంజీవిని వదలలేదు. రాజశేఖర్ మీద దాడి ఇందుకు సరైన ఉదాహరణ. చిరంజీవి ద్రుష్టి లో పడాలని వాళ్లు అలా చేశారు. దాని వల్ల చిరంజీవికి, అభిమానులకీ ఎంత చెడ్డ పేరు వచ్చిందో అందరికీ తెలిసిందే.
చివరికి ఎన్నికల సంఘానిది కూడా అదే తీరు. రాష్ట్రం లో ఉన్న వోటర్లలో పది శాతం మంది సభ్యత్వం ఉన్న పార్టీ కి ఒక ఉమ్మడి గుర్తు కేటాయించాలంటే వాళ్లకి ఇబ్బందంట. అదే 294 అభ్యర్ధులకు 294 గుర్తులు కేటాయించటం మాత్రం వాళ్లకి తేలికంట.
ఇలా వ్యవస్థ లో ఉన్న ప్రతి ఒక్కరు ఇలా 'చిరు' పేరు ను తమ తమ స్వార్థ ప్రయోజనాలకోసం వాడుకుంటున్నారు. చిరు కి చెడ్డ పేరు తెస్తున్నారు. ఇంతకు ముందు కూడా చాలా సినిమాల్లో డైలాగ్స్ లో మెగాస్టార్ పేరు పెడితే ఫాన్స్ అన్నా చూస్తారనే ఉద్దేశం తో 'చిరు' మీద ఒకట్రెండు డైలాగ్స్ పెట్టారు. అయితే వీటివల్ల చిరు కి వచ్చిన నష్టం ఏమి లేదు. కానీ ఇప్పుడు పత్రికలు మొదలు కొని టీవీ చానెల్స్, రాజకీయ నాయకులు, చివరికి అభిమానులు కూడా ఆ పేరు ని ఎక్స్ ప్లాయిట్ చేస్తున్నారు. చిరంజీవి కి తల నెప్పి తీసుకువస్తున్నారు.
కర్ణుడి చావు కి కారణాలు అనేకం అన్నట్లు ఇవన్నీ చిరంజీవి ఓటమి కి కారణం అవుతాయో లేక సినిమాల్లో లాగా వీటన్నిటినీ తట్టుకొని చిరంజీవి విజయం సాధిస్తాడో తెలుసుకోవాలంటే ఎన్నికలయ్యేదాకా ఆగాల్సిందే.

Thursday, February 26, 2009

ఆర్టిసి బస్సు.

ఇవ్వాళ టీ కొట్టు లో "ఈనాడు" కనపడితే అలా చూసేసరికి, ఎవరో మాదిగ (ఎమార్పీఎస్) కార్యకర్తలు ఆర్టిసి బస్సు ని తగల పెట్టారు అని రాశారు. చాలా బాధేసింది. ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్లు ఎవరు ఏ గొడవ చేయాలనుకున్నా వచ్చి ఆర్టిసి బస్సు మీద పడతారు. అసలు బస్సు ఏం పాపం చేసింది. మన రాష్ట్రం లో బైటికి వెళ్లాలంటే ఎక్కువ మంది వాడేది బస్సు. మనం ఏ ఊరు వెళ్లాలంటే ఆ ఊరికి చేర్చటమేనా ఆ బస్సు కాని ఆ సంస్థ కాని చేసే పాపం. అసలు అలా కాల్చేవాళ్లు జీవితం లో ఎన్ని సార్లు ఎక్కుంటారు బస్సు ని? అంతలా ఉపయోగపడే బస్సు ని ఎవడబ్బ సొమ్మని కాలుస్తారు ఆ దరిద్రులు, వాళ్లని ఇలాంటి విషయాలు చేయమని ప్రొత్సహించే రాజకీయ నాయకులు? నా ఉద్దేశం లో ఆ బస్సు ఖరీదు వసూలు చేయటం తో పాటు యావజ్జీవ శిక్ష విధించాలి అలా బస్సులని తగలబెట్టిన వాళ్లకి. ఏదన్నా నిరసన వ్యక్తం చేయాలంటే చేయాలంటే చేయాల్సిన విధానం లో చేయాలి గాని ఇలా జనాలకి ఉపయోగపడే వాటినల్లా తగల పెడితే ఎలా?