Showing posts with label తెలుగుదేశం. Show all posts
Showing posts with label తెలుగుదేశం. Show all posts

Friday, December 31, 2010

రాజకీయ బలప్రయోగాలు vs రాజకీయ చేయూత

ప్రార్ధించే పెదవుల కన్నా చేయూతనిచ్చే చేతులు మిన్న అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఈ మధ్య వచ్చిన అకాల వర్షాల వల్ల ఎంతో మంది రైతులు మరణించారు, ఇంకా మారనిస్తూనే ఉన్నారు. వారికి ప్రభుత్వం ప్రకటించిన సాయం పక్కన పెడితే ప్రతిపశాలు మాత్రం దీక్ష లు, గర్జనలు అంటూ తెగ గోల చేస్తున్నాయి.

జగన్ లక్ష దీక్ష అంటూ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఇది ఒక నిరాహార దీక్ష లా కాకుండా ఒక బల పరీక్ష లాగా, ఒక పార్టీ announcement సభ లాగా జరిగింది. కొత్తగా రిలీస్ అయ్యే సినిమా కి పబ్లిసిటీ కి ఎంత ఖర్చు పెడతారో అంతకు 100 రెట్లు ఖర్చు పెట్టారు ప్రచారం కోసం ఒక్క కృష్ణా జిల్లాలోనే. ప్రతి ఊళ్లో వందల పోస్టర్లు బానర్లు కట్టారు. ఒక మనిషి దగ్గర లక్ష కోట్లు ఉంటే మీడియా మొత్తాన్ని కొని, ఇంకా డబ్బులతో ఏమేమి చేయవచ్చో దానికి ఈ దీక్ష, జగన్ ప్రత్యక్ష ఉదాహరణలు. ఈ దీక్ష కు పెట్టిన ఖర్చు తో రైతులను ఆడుకోవచ్చు కదా అంటే ఆ పని మాత్రం చేయడు. ఎందుకంటే ఇతనికి కావాల్సింది బలపరీక్ష కానీ రైతు సంక్షేమం కాదు. ఈ దీక్ష వల్ల రైతులకు ఒరిగింది పేద్ద గుండు సున్నా.


ఇక చంద్ర బాబు దీక్షలో పెద్దగా హంగు ఆర్భాటాలు లేవు. కాకపోతే తెలివిగా ప్రచారం కోసం డబ్బులు ఖర్చుపెట్టకుండా, తెలివిగా (ఊరు, పేరు లేని) జాతీయ నేతలతో హంగామా చేసి వాళ్ల కోసం ప్రత్యేక విమానాలు ఈర్పాటు చేసి చివరికి ప్రభుత్వం కొద్దిగా కూడా స్పందించకపోవటంతో సమ్మగా చిన్న డ్రామా ఆది సర్దుకున్నాడు. ఇక ఇప్పుడు బలపరీక్ష మొదలు పెట్టింది తెలుగు దేశం కూడా. రైతుకోసం అని పేరు పెట్టి ఈ సభ కోసం మరి ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారో వాళ్లకే తెలియాలి. ఇక వీళ్ళ సొంత మీడియా దీనికి ఇస్తున్న coverage అంతా ఇంతా కాదు. ఇక్కడ కూడా రైతులకు ఒరిగేది ఏమీ లేదు. బండి సున్నా.


ఇక మన అభిమాన నేత kcr తెలంగాణ లో ఇంత మంది రైతులు చనిపోయిన అసలు చీమా కూడా కుట్టినట్లు లేదు ఇతనికి. కనీసం తెలంగాణ రైతుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తెలంగాణ రాకముందే ఇతను ఇలా ఉంటే ఇక తెలంగాణ వచ్చాక ఏంచేస్తాడో మనం ఊహించుకోవచ్చు. ఇక్కడ సున్నా కూడా అనవసరం. నో సున్నా


వీళ్లందరితో పోల్చుకుంటే అంత వనరులు లేకపోయినా, హంగు ఆర్భాటం లేకుండా చిరు అందిస్తున్న సహకారం అభినందనీయం. పై రెండు దీక్షలపై వచ్చిన కధానాలలో కనీసం వందో వంతు కధానాలు కూడా 'చిరు' సహాయం గురించి కనిపించదు మన మీడియా లో. వీరు అందించే 25 వేలు చాలా తక్కువ మొత్తం అయ్యుండొచ్చు. కానీ చనిపోయిన రైతు కుటుంబాలలో ఇదే కొంచెం ధైర్యాన్ని నింపుతుంది.














Wednesday, September 15, 2010

చంద్ర బాబు కి అభినందనలు

తెలంగాణ రైతులు రోడ్లెక్కి ఎరువుల కోసం రాస్తా రోకోలు చేస్తుంటే so called తెలంగాణ నాయకులం అని చెప్పుకొనే ఒక్కడు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఉద్రిక్త పరిస్తుతులు ఉన్నా అక్కడికి వెళ్ళి ఆ సమస్య రాష్ట్రం మొత్తం వినపడేలా చేసినందుకు బాబు కు అభినందనలు.
చిన్నప్పుడు క్లాస్ లో చివరి బెంచి లో కూర్చొని గొడవ చేస్తున్న కొంత మందిని మా టీచర్ ఇలా తిట్టే వాళ్ళు "ఒరేయ్ నువ్వు ఎలాగూ చదివి చచ్చేది లేదు ఎందుకురా పక్కన వాళ్ళని కూడా చెడగొడతావ్" అని. సరిగ్గా ఇది kcr కి వర్తిస్తుంది. తెలంగాణ వారి ప్రయోజనాల కోసం ఈ మహానుభావుడు చేసిన ఒక్క మంచి పని లేదు, అది సరి కదా, కనీసం ప్రజల సమస్యల మీద వేరే పార్టీ వారు ధర్నాలు చేస్తుంటే కనీసం వాళ్ళను కూడా చేయనీయడు. వీడి ఉద్దేశం ఎంతో అర్థం కాదు. ఆ రైతులు ఎరువులు దొరక్క వాళ్ళ శ్రమ అంతా వృధా కావాలని వీడి కొరికేమో మరి. బాబ్లీ మీద ఉద్యమం చేస్తుంటే ఎన్నికలున్నాయని చేస్తున్నారు అంటాడు. మరి ఇప్పుడు ఎన్నికలు లేవు కదా, మరి ఇప్పుడు ఈ ఏడుపు ఏంటో అర్థం కాదు. పక్క రాష్ట్రం వాడు మన నీళ్ళు దోచుకుంటే మనకు నష్టం లేదు, అదే గోదావరి చివరలో ఒక ప్రాజెక్ట్ కడుతుంటే దాని మీద పది ఏడుస్తాడు. ఒక వేరే దేశపు యువతి ఒక పార్టీ కి అధ్యక్షురాలుగా ఉంటే మనకు నష్టం లేదు, సాటి తెలుగు వాడు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉంటే తెలుగు దేశం ఆంధ్ర పార్టీ అని చెత్త ప్రచారాలు మొదలు పెడతాడు. నిజం చెప్పాలంటే తెలంగాణ మీద నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ. కానీ వాళ్ళని నిలదీయకుండా ఎంత సేపు తెలుగుదేశాన్ని target చేసి kcr చేసే విష ప్రచారాలు వీడు కాంగ్రెస్ తో కుమ్మక్కయిన విషయాన్ని చెప్పకనే చెపుతున్నాయి.
కాకపోతే ఇక్కడ తెలుగు దేశం కూడా కొన్ని సందర్భాలలో నిందించాలి. జగన్ తెలంగాణ వస్తుంటే మొట్ట మొదట జగన్ ను ఇక్కడ తిరగనివ్వం అని ఎర్రబల్లి చేసిన వివాదం అంతా ఇంతా కాదు. ఇలా వాళ్ళ రాజకీయ ప్రత్యర్ధులను అడ్డుకోవటానికి మొదట తెలంగాణ వాదాన్ని వాడుకోవటానికి ప్రయత్నించింది తెలుగు దేశం వాళ్ళే. ఇప్పుడు అదే వాళ్ళకి ఎసరు పెట్టింది.
ఇక పోతే బాబు కాన్వాయ్ మీద దాడి అందరూ ముక్త కంఠం తో ఖండించాల్సిన విషయం. దేశం లో ఎవరు ఎక్కడికైనా వెళ్లొచ్చు ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేని kcr అండ్ కాంగ్రెస్ తెలంగాణ నాయకులకు బుద్ధి ఎప్పుడూ వస్తుందో అర్థం కావటం లేదు. చివరికి బాబు పై ఈ దాడిని కూడా రాజకీయ పార్టీల నాయకులు ('చిరు' మినహా)ఖండించలేక పోగా, ఇందులో తప్పేమీ లేదు అన్నట్లు మాట్లాడిన kcr, vh లు నేటి రాజకీయాల దిగజారుడు తనానికి నిదర్శనం. ఏది ఏమైనా బాబు కి హృదయ పూర్వక అభినందనలు.

Tuesday, June 8, 2010

కాంగ్రెస్ గడ్డి తింటే మేమూ తింటాం...

తీరు లాగా ఉంది తెలుగు దేశం పార్టీ తీరు.
తెలంగాణ గురించి చంద్రబాబు ని వైఖరి చెప్పమంటే కాంగ్రెస్ అధ్యక్షురాలు తన వైఖరి చెప్తే చెప్తాడంట...
తెలంగాణ తెదేపా నాయకులని రాజీనామా చేయమని అడిగితే కాంగ్రెస్ వాళ్ళు చేస్తే చేస్తారంట...
ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుంది కాబట్టి మేమూ పోటీ చేస్తాం అంటున్నారు ఇప్పుడు...
అంటే కాంగ్రెస్ గడ్డి తింటే మీరూ తింటారా? కాంగ్రెస్ తో ఇంత భావ సారూప్యం పెట్టుకున్న మీకు ఒక పార్టీ అవసరమా? మీరు కూడా కాంగ్రెస్ లో విలీనం అయిపోయి హాయిగా heritage వ్యాపారం చేసుకోవచ్చు కదా. అప్పుడు ఇన్ని వెధవ కారణాలు వెతుక్కోనే అవసరం రాదు.
మీకు నిజంగా దమ్ముంటే ఎన్నికలు కాబట్టి పోటీ చేస్తున్నాం అని ధైర్యంగా చెప్పండి. సంవత్సరం తిరక్కుండానే రాజీనామా ఏంటి అని ఎదిరించండి అంతే కానీ కాంగ్రెస్ వాళ్ళు ప్రతి దాన్ని అధిష్టానం మీదకు తోసినట్లు మీరు కాంగ్రెస్ మీద తోయటం దేనికి?
ఇక అన్నిటికన్నా హైలైట్ ఇవ్వాళ ఈనాడు లో రాసిన కింద వార్త. covering అంటే ఎలా ఉండాలో ఈ వార్త ను చూసి నేర్చుకోవాలి మిగతా రాజకీయ పార్టీలను సపోర్ట్ చేసే వార్తా పత్రికల వాళ్ళు. ఇది చదివిన వాళ్ళు మాత్రం నువ్వు నాకు నచ్చావ్ సినిమా లో సునీల్ కళ్ళ నీళ్ళు పెట్టుకొని "మీరు కలెక్టర్ అవుతారు బాబు" అన్నట్లు "తెలుగుదేశం పోటీ చేయాల్సిందే బాబు" అనుకోవటం మాత్రం ఖాయం.

హాయిగా బాబు లాగా ఈనాడు లాంటి ఒక paper ని కొనుక్కుంటే ప్రధాన ప్రతిపక్షం గా ఉండి ప్రజలకు పైసా పని చేయకపోయినా రాష్ట్రాన్ని అంతా మనమే ఉద్ధరిస్తున్నట్లు ఫోసు కొడుతూ happy గా టైమ్ పాస్ చేయొచ్చు.

Thursday, April 8, 2010

ప్రజారాజ్యం నివేదిక సమర్పణ


రాష్ట్రం లో వెనుకపాడిన జిల్లాలే ఉన్నాయి ప్రాంతాలు కాదు అన్న statement నూటికి లక్ష పాళ్లు correct. నివేదికతో పాటు కొన్ని పరిష్కారాలను సూచించటం కూడా బాగుంది. TDP, congress లాగా ద్వంద్వ వైఖరితో double game ఆడకుండా ఒక స్పష్టమైన, కఠినమైన నిర్ణయాన్ని తీసుకొని ఆ మేరకు నివేదిక ఇచ్చిన ప్రజారాజ్యానికి మరో సారి అభినందనలు. TDP, congress లకు రాష్ట్రం లో వాళ్ళ వాళ్ళ పార్టీలను కాపాడుకోవటమే కావాలి తప్ప రాష్ట్ర ప్రజల బాగు కాదు అని చెప్పటానికి తెలంగాణ అంశం ఒక్కటి చాలు. TDP, congress go back. Jai ప్రజా రాజ్యం.

Monday, February 22, 2010

రైల్వే బడ్జెట్ గురించి ముందు చూపేది?




రైల్వే బడ్జెట్ లో అన్యాయం జరగగానే అందరూ విమర్శించటం, కేంద్ర మంత్రులు కొద్దిగా అసంతృప్తి నటించి తర్వాత చిన్నగా ఒక వినతి పత్రం సమర్పించటం, దాన్ని రైల్వే వాళ్ళు ఒక చెత్త బుట్ట లో పడేయటం, ఒక వారం రోజులు కాగానే మీడియా ఇంకో కొత్త సంచలనాత్మక వార్తను ఎంచుకొని ఈ సమస్యను గాలికి వదిలేయటం, చిన్నగా అందరూ ఈ విషయాన్ని మర్చిపోవటం. ఇది ప్రతి సంవత్సరం మార్చి లో మన రాష్ట్రం లో జరిగే తంతే. ఈ మాత్రం దానికి మనకు కేంద్రం లో మంత్రులు, MPs అవసరమా, రాష్ట్రంమ్ లో ప్రభుత్వం, ప్రతిపక్షం అవసరమా? ఇక 30 యేళ్లుగా రాజకీయాల్లో ఉండి, 9 యేళ్లు ముఖ్యమంత్రి గా ఉన్న పెద్దాయన, ఒక రోజు అకస్మాత్తుగా నిద్ర లేచి "అసలు రాష్ట్రం లో ప్రభుత్వం ఉందా" అని ఒక statement మీడియా కి పడేసి మళ్ళీ ఎప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశం వస్తుందా అని చూస్తుంటాడు తప్పితే ప్రభుత్వానికి constructive గా ఒక్క సలహా కూడా ఇవ్వడు, ప్రజలకు మేలు చేసే పని ఒక్కటి చేయడు. అంతా అయ్యాక విమర్శించటానికి మాత్రం రెడీ.

anyways, I really appreciate chiru for doing this


Thursday, August 20, 2009

తెలుగుదేశం - ఈనాడు - ఆంధ్రజ్యోతి

ఈ పోస్ట్ లో ఎ2జెడ్ అన్నట్లు తొమ్మిది సంవత్సరాలు అధికారం లో ఉండి ఈ పనులు మేము చేశాం కాబాట్టి మమ్మల్ని గెలిపించండి అని అనాల్సింది పోయి పూర్తిగా కాంగ్రెస్ వ్యతిరేక వోటు మీద ఆధారపడి చిన్న పార్టీలకు వోటు వేయటం వృధా అంటూ చివరికి ఒక సీటు మాత్రమే గెలుచుకున్న లోక్సత్తా మీద కూడా ఏడవటం చాలా ఛండాలంగా ఉంది.

ఒక పక్క ప్రభుత్వం ఆపరేషన్ "ఆకర్ష్" ప్రవేశ పెట్టింది అంటూ తన రెండు పత్రికలలో గగ్గోలు పెట్టిస్తూ ఇటు పక్క "ప్రజారాజ్యం" లో ఉన్న పాత తెదేపా నేతలందరితోటి ఫోన్ లలో సంప్రదించి పార్టీలోకి రావాలని ఆహ్వానించటం, నేతలు ఎవరు తిరిగి వచ్చినా పూర్వ గౌరవం ఇస్తాం అని పబ్లిక్ గా ప్రకటనలు ఇవ్వటం ఆ పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనం.

అసెంబ్లీ లో ఎప్పుడు చూసినా నువ్వంత తిన్నావు, నువ్వు ఇంత తిన్నావు, నువ్వో పెద్ద ఫాక్షనిస్ట్ వి అంటూ వ్యక్తిగత విమర్శలే కాని, సరిగ్గా సమస్యల గురించి గత ఇదేళ్లలో చేసింది చాలా తక్కువ. కొత్తగా అసెంబ్లీ లో అడుగు పెట్టిన చిరంజీవి, జెపి లను చూసి కూడా వీళ్లకు బుద్ధి రావట్లేదు. మాట్లాడితే వాకౌట్ లేక పోతే నిరసనలు తప్పితే సమస్యలు పట్టవు. డే 1 నుంచి కాంగ్రెస్ ఏది చేసినా వీళ్లకు తప్పే. మాట్లాడితే కాంగ్రెస్ ది సాంకేతిక గెలుపు మాత్రమే, మేం ఓడిపోయి గెలిచాం, వాళ్లు గెలిచి ఓడిపోయారు అనటం బాబు మూర్ఖత్వానికి నిదర్శనం. 64 శాతం మంది కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వేశారు అంటాడే కాని 70 శాతం మంది తెలుగు దేశానికి వ్యతిరేకంగా ఉన్న సంగతి మాత్రం ఆయనకు అనవసరం.

ఇక వీళ్లేం చేసినా వంత పాడటానికి ఒక రెండు వెధవ పత్రికలున్నాయి. నేను అనుకోవటం రామోజీ రావు, బాబు, రాధా కృష్ణ ల మధ్య రోజు కాంఫరెన్స్ జరుగుతుందేమో. ముగ్గురు కలిసి ఒక సమయం లో ఒకే ఒక వార్త ని బలంగా ప్రజల మీద రుద్దతానికి ప్రయత్నిస్తారు. నెల రోజుల క్రితం ఆపరేషన్ "ఆకర్ష్" అని ప్రభుత్వం మీద పడ్డాయి. కొన్ని రోజుల తర్వాత లోక్సత్తా పార్టీ మీద ఏడ్చాయి. ఇప్పుడు తాజాగా ప్రజా రాజ్యం మీద పడ్డాయి. ప్రజా రాజ్యం లో నాయకులు ఆనందంగానే ఉన్నా వాళ్లు పార్టీ మారాలనుకుంటున్నారు, వీళ్లు మారాలనుకుంటున్నారు అంటూ వార్తలు రాసి వాళ్లు నిజం గా తెదేపా లో చేరేటట్లు చేయటం ఈ ఆపరేషన్ లక్ష్యం. వాస్తవానికి ప్రజా రాజ్యం వల్ల తెలుగు దేశం కు ఎంత నష్టం జరిగిందో కాంగ్రెస్ కూడా అంతే నష్టం జరిగింది. కాని ఈ ముగ్గురు పని గట్టుకొని కాంగ్రెస్ కి ప్రజా రాజ్యం వల్ల లాభం అంటూ ఒకే సారి ఊదరగొడుతూ ప్రభుత్వ వ్యతిరేక వోటు పొందాలని చూస్తున్నారు. చిరంజీవి ని కాంగ్రెస్ కు ఎంత దగ్గరగా చూపిస్తే వీళ్లకు అంత లాభం అని వీళ్ల ఉద్దేశం. ఇవ్వాళ ఈనాడు లో వచ్చిన వార్తే దీనికి నిదర్శనం.

ఒక ప్రధాన ప్రతిపక్షం హోదాలో ఉండి కరువు, ధరల పెరుగుదల, కేంద్రం లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, బెల్ట్ షాపులు, విపరీతంగా ఫీజుల పెంపకం, అధ్వాన్నమైన రోడ్లు, మంచి నీటి సమస్య, ప్రభుత్వ స్థలాల అమ్మకం ఇలాంటి సమస్యల పై అసెంబ్లీ లో పోరాడకుండా అసెంబ్లీ బయట ఇలా మీడియా తో కుమ్మక్కై దొంగ రాజకీయాలు చేయటం దారుణ మైన విషయం.

రెండు ప్రముఖ దినపత్రికలు అయ్యుండి ప్రజలకు నిజా నిజాలు అందించాల్సింది పోయి ఒక రాజకీయ పార్టీ కి అండగా చేరి ప్రజలను మభ్య పెట్టడం దారుణాతి దారుణం.