Thursday, February 26, 2009

ఆర్టిసి బస్సు.

ఇవ్వాళ టీ కొట్టు లో "ఈనాడు" కనపడితే అలా చూసేసరికి, ఎవరో మాదిగ (ఎమార్పీఎస్) కార్యకర్తలు ఆర్టిసి బస్సు ని తగల పెట్టారు అని రాశారు. చాలా బాధేసింది. ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్లు ఎవరు ఏ గొడవ చేయాలనుకున్నా వచ్చి ఆర్టిసి బస్సు మీద పడతారు. అసలు బస్సు ఏం పాపం చేసింది. మన రాష్ట్రం లో బైటికి వెళ్లాలంటే ఎక్కువ మంది వాడేది బస్సు. మనం ఏ ఊరు వెళ్లాలంటే ఆ ఊరికి చేర్చటమేనా ఆ బస్సు కాని ఆ సంస్థ కాని చేసే పాపం. అసలు అలా కాల్చేవాళ్లు జీవితం లో ఎన్ని సార్లు ఎక్కుంటారు బస్సు ని? అంతలా ఉపయోగపడే బస్సు ని ఎవడబ్బ సొమ్మని కాలుస్తారు ఆ దరిద్రులు, వాళ్లని ఇలాంటి విషయాలు చేయమని ప్రొత్సహించే రాజకీయ నాయకులు? నా ఉద్దేశం లో ఆ బస్సు ఖరీదు వసూలు చేయటం తో పాటు యావజ్జీవ శిక్ష విధించాలి అలా బస్సులని తగలబెట్టిన వాళ్లకి. ఏదన్నా నిరసన వ్యక్తం చేయాలంటే చేయాలంటే చేయాల్సిన విధానం లో చేయాలి గాని ఇలా జనాలకి ఉపయోగపడే వాటినల్లా తగల పెడితే ఎలా?