Thursday, August 20, 2009

తెలుగుదేశం - ఈనాడు - ఆంధ్రజ్యోతి

ఈ పోస్ట్ లో ఎ2జెడ్ అన్నట్లు తొమ్మిది సంవత్సరాలు అధికారం లో ఉండి ఈ పనులు మేము చేశాం కాబాట్టి మమ్మల్ని గెలిపించండి అని అనాల్సింది పోయి పూర్తిగా కాంగ్రెస్ వ్యతిరేక వోటు మీద ఆధారపడి చిన్న పార్టీలకు వోటు వేయటం వృధా అంటూ చివరికి ఒక సీటు మాత్రమే గెలుచుకున్న లోక్సత్తా మీద కూడా ఏడవటం చాలా ఛండాలంగా ఉంది.

ఒక పక్క ప్రభుత్వం ఆపరేషన్ "ఆకర్ష్" ప్రవేశ పెట్టింది అంటూ తన రెండు పత్రికలలో గగ్గోలు పెట్టిస్తూ ఇటు పక్క "ప్రజారాజ్యం" లో ఉన్న పాత తెదేపా నేతలందరితోటి ఫోన్ లలో సంప్రదించి పార్టీలోకి రావాలని ఆహ్వానించటం, నేతలు ఎవరు తిరిగి వచ్చినా పూర్వ గౌరవం ఇస్తాం అని పబ్లిక్ గా ప్రకటనలు ఇవ్వటం ఆ పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనం.

అసెంబ్లీ లో ఎప్పుడు చూసినా నువ్వంత తిన్నావు, నువ్వు ఇంత తిన్నావు, నువ్వో పెద్ద ఫాక్షనిస్ట్ వి అంటూ వ్యక్తిగత విమర్శలే కాని, సరిగ్గా సమస్యల గురించి గత ఇదేళ్లలో చేసింది చాలా తక్కువ. కొత్తగా అసెంబ్లీ లో అడుగు పెట్టిన చిరంజీవి, జెపి లను చూసి కూడా వీళ్లకు బుద్ధి రావట్లేదు. మాట్లాడితే వాకౌట్ లేక పోతే నిరసనలు తప్పితే సమస్యలు పట్టవు. డే 1 నుంచి కాంగ్రెస్ ఏది చేసినా వీళ్లకు తప్పే. మాట్లాడితే కాంగ్రెస్ ది సాంకేతిక గెలుపు మాత్రమే, మేం ఓడిపోయి గెలిచాం, వాళ్లు గెలిచి ఓడిపోయారు అనటం బాబు మూర్ఖత్వానికి నిదర్శనం. 64 శాతం మంది కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వేశారు అంటాడే కాని 70 శాతం మంది తెలుగు దేశానికి వ్యతిరేకంగా ఉన్న సంగతి మాత్రం ఆయనకు అనవసరం.

ఇక వీళ్లేం చేసినా వంత పాడటానికి ఒక రెండు వెధవ పత్రికలున్నాయి. నేను అనుకోవటం రామోజీ రావు, బాబు, రాధా కృష్ణ ల మధ్య రోజు కాంఫరెన్స్ జరుగుతుందేమో. ముగ్గురు కలిసి ఒక సమయం లో ఒకే ఒక వార్త ని బలంగా ప్రజల మీద రుద్దతానికి ప్రయత్నిస్తారు. నెల రోజుల క్రితం ఆపరేషన్ "ఆకర్ష్" అని ప్రభుత్వం మీద పడ్డాయి. కొన్ని రోజుల తర్వాత లోక్సత్తా పార్టీ మీద ఏడ్చాయి. ఇప్పుడు తాజాగా ప్రజా రాజ్యం మీద పడ్డాయి. ప్రజా రాజ్యం లో నాయకులు ఆనందంగానే ఉన్నా వాళ్లు పార్టీ మారాలనుకుంటున్నారు, వీళ్లు మారాలనుకుంటున్నారు అంటూ వార్తలు రాసి వాళ్లు నిజం గా తెదేపా లో చేరేటట్లు చేయటం ఈ ఆపరేషన్ లక్ష్యం. వాస్తవానికి ప్రజా రాజ్యం వల్ల తెలుగు దేశం కు ఎంత నష్టం జరిగిందో కాంగ్రెస్ కూడా అంతే నష్టం జరిగింది. కాని ఈ ముగ్గురు పని గట్టుకొని కాంగ్రెస్ కి ప్రజా రాజ్యం వల్ల లాభం అంటూ ఒకే సారి ఊదరగొడుతూ ప్రభుత్వ వ్యతిరేక వోటు పొందాలని చూస్తున్నారు. చిరంజీవి ని కాంగ్రెస్ కు ఎంత దగ్గరగా చూపిస్తే వీళ్లకు అంత లాభం అని వీళ్ల ఉద్దేశం. ఇవ్వాళ ఈనాడు లో వచ్చిన వార్తే దీనికి నిదర్శనం.

ఒక ప్రధాన ప్రతిపక్షం హోదాలో ఉండి కరువు, ధరల పెరుగుదల, కేంద్రం లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, బెల్ట్ షాపులు, విపరీతంగా ఫీజుల పెంపకం, అధ్వాన్నమైన రోడ్లు, మంచి నీటి సమస్య, ప్రభుత్వ స్థలాల అమ్మకం ఇలాంటి సమస్యల పై అసెంబ్లీ లో పోరాడకుండా అసెంబ్లీ బయట ఇలా మీడియా తో కుమ్మక్కై దొంగ రాజకీయాలు చేయటం దారుణ మైన విషయం.

రెండు ప్రముఖ దినపత్రికలు అయ్యుండి ప్రజలకు నిజా నిజాలు అందించాల్సింది పోయి ఒక రాజకీయ పార్టీ కి అండగా చేరి ప్రజలను మభ్య పెట్టడం దారుణాతి దారుణం.