Wednesday, November 4, 2009

రాజకీయంగా ఎదుగుతున్న ప్రరాపా.

కాంగ్రెస్ తో పొత్తు విఫలం కూడా ప్రజారాజ్యానికి ఒకందుకు మంచిదే అయ్యింది. ముందు ముందు పొత్తులకు వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్త లు వహించాలో చెప్పకనే చెప్పింది ఈ పాఠం. పొత్తు విఫలం అవ్వటాన్ని పక్కన పెడితే రాజకీయంగా ప్రరాపా కూడా కొద్దికొద్దిగా ఎదుగుతున్నట్లు కనిపిస్తుంది. ఒకటి కాంగ్రెస్ లాంటి పార్టీ తో పొత్తు చర్చలు జరపటం ద్వారా తెదేపా లాంటి పార్టీల గొంతులో వెలక్కాయ పడినట్లయింది. ఈ రకంగా ప్రరాపా కూడా రాజకీయంగా ఎత్తులు వేయటానికి ప్రయత్నించటం బాగుంది. ఇక్కడ అన్నిటికన్నా పెద్ద కామెడీ ఏంటంటే ఎందుకు పొత్తు పెట్టుకున్నారో ప్రజలకు వివరణ ఇవ్వాలి అని తెదేపా డిమాండ్ చేయటం. మరి వాళ్ళు 2009 ఎన్నికల్లో అప్పటి వరకు బండబూతులు తిట్టుకున్న తెరాస తో పొత్తు పెట్టుకొని జనాలకు ఏమి వివరణ ఇచ్చారో వాళ్లకే తెలియాలి. ఇక పొత్తు లేకుండా ఒక్క ఎన్నికల్లో కూడా బరిలోకి దిగని వామ పక్షాల వాళ్ళు కూడా ఈ విషయం మీద తోక ఊపే వాళ్ళే.
ఈ మధ్య ప్రరాపా లో కనిపిస్తున్న ఇంకో మార్పు ఏంటంటే ఎవరన్నా విమర్శిస్తే వాళ్ల చెంప పగిలేలా సమాధానం చెప్పటం. మొదట్లో ఎవరన్నా విమర్శిస్టే వాళ్ళ పాపానికి వాళ్ళేపోతారు అని ఊరుకొనే వాళ్ళు ప్రరాపా వాళ్లు. ప్రత్యర్ధులందరు టికెట్లు అమ్ముకున్నారు అని అని భారీగా విమర్శించినా దాని మీద పెద్దగా స్పందించకపోవటం వల్ల పార్టీ కి భారీ నష్టమే జరిగింది. ఆ విషయం లేట్ గా అయినా లేటెస్ట్ గా తెలుసుకున్నట్లున్నారు. వామ పక్షాలు పొత్తు మీద విమర్శిస్తే "పొత్తుల్లో చరిత్ర సృష్టించిన మీరు మాట్లాడకుండా ఉంటే మంచింది" అన్నీ వంగా గీత గట్టి సమాధానమే చెప్పింది. తెదేపా వాళ్ళు ఒక చర్చ లో మీరు ఎందుకు విధానాలని మార్చుకొని పొత్తు పెట్టుకుంటున్నారు అని అడిగిన దానికి "సంక్షేమ పధకాలకు వ్యతిరేకం అని చెప్పిన చంద్ర బాబు మనిషికి రెండు వేలు ఇచ్చి రాష్ట్రాన్ని దివాళా తీసే పధకాన్ని తెచ్చి మీ మౌళిక మైన విధానాలనే మార్చుకున్నారు". అలాంటి మీరు మమ్మల్ని మా విధానాలు మార్చుకున్నాము అంటూ అనటం హాస్యాస్పదం అని వాసిరెడ్డి పద్మ సమాధానం బాగుంది.
ఏది ఏమైనా ప్రరాపా కి ఇలా దెబ్బ మీద దెబ్బ తగలటం వల్ల పార్టీ లో కొద్ది కొద్దిగా కసి పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. మరి చూద్దాం ఈ కసి అన్నా పార్టీ ని నిలబెడుతుందో లేదో.