Wednesday, September 15, 2010

చంద్ర బాబు కి అభినందనలు

తెలంగాణ రైతులు రోడ్లెక్కి ఎరువుల కోసం రాస్తా రోకోలు చేస్తుంటే so called తెలంగాణ నాయకులం అని చెప్పుకొనే ఒక్కడు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఉద్రిక్త పరిస్తుతులు ఉన్నా అక్కడికి వెళ్ళి ఆ సమస్య రాష్ట్రం మొత్తం వినపడేలా చేసినందుకు బాబు కు అభినందనలు.
చిన్నప్పుడు క్లాస్ లో చివరి బెంచి లో కూర్చొని గొడవ చేస్తున్న కొంత మందిని మా టీచర్ ఇలా తిట్టే వాళ్ళు "ఒరేయ్ నువ్వు ఎలాగూ చదివి చచ్చేది లేదు ఎందుకురా పక్కన వాళ్ళని కూడా చెడగొడతావ్" అని. సరిగ్గా ఇది kcr కి వర్తిస్తుంది. తెలంగాణ వారి ప్రయోజనాల కోసం ఈ మహానుభావుడు చేసిన ఒక్క మంచి పని లేదు, అది సరి కదా, కనీసం ప్రజల సమస్యల మీద వేరే పార్టీ వారు ధర్నాలు చేస్తుంటే కనీసం వాళ్ళను కూడా చేయనీయడు. వీడి ఉద్దేశం ఎంతో అర్థం కాదు. ఆ రైతులు ఎరువులు దొరక్క వాళ్ళ శ్రమ అంతా వృధా కావాలని వీడి కొరికేమో మరి. బాబ్లీ మీద ఉద్యమం చేస్తుంటే ఎన్నికలున్నాయని చేస్తున్నారు అంటాడు. మరి ఇప్పుడు ఎన్నికలు లేవు కదా, మరి ఇప్పుడు ఈ ఏడుపు ఏంటో అర్థం కాదు. పక్క రాష్ట్రం వాడు మన నీళ్ళు దోచుకుంటే మనకు నష్టం లేదు, అదే గోదావరి చివరలో ఒక ప్రాజెక్ట్ కడుతుంటే దాని మీద పది ఏడుస్తాడు. ఒక వేరే దేశపు యువతి ఒక పార్టీ కి అధ్యక్షురాలుగా ఉంటే మనకు నష్టం లేదు, సాటి తెలుగు వాడు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉంటే తెలుగు దేశం ఆంధ్ర పార్టీ అని చెత్త ప్రచారాలు మొదలు పెడతాడు. నిజం చెప్పాలంటే తెలంగాణ మీద నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ. కానీ వాళ్ళని నిలదీయకుండా ఎంత సేపు తెలుగుదేశాన్ని target చేసి kcr చేసే విష ప్రచారాలు వీడు కాంగ్రెస్ తో కుమ్మక్కయిన విషయాన్ని చెప్పకనే చెపుతున్నాయి.
కాకపోతే ఇక్కడ తెలుగు దేశం కూడా కొన్ని సందర్భాలలో నిందించాలి. జగన్ తెలంగాణ వస్తుంటే మొట్ట మొదట జగన్ ను ఇక్కడ తిరగనివ్వం అని ఎర్రబల్లి చేసిన వివాదం అంతా ఇంతా కాదు. ఇలా వాళ్ళ రాజకీయ ప్రత్యర్ధులను అడ్డుకోవటానికి మొదట తెలంగాణ వాదాన్ని వాడుకోవటానికి ప్రయత్నించింది తెలుగు దేశం వాళ్ళే. ఇప్పుడు అదే వాళ్ళకి ఎసరు పెట్టింది.
ఇక పోతే బాబు కాన్వాయ్ మీద దాడి అందరూ ముక్త కంఠం తో ఖండించాల్సిన విషయం. దేశం లో ఎవరు ఎక్కడికైనా వెళ్లొచ్చు ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేని kcr అండ్ కాంగ్రెస్ తెలంగాణ నాయకులకు బుద్ధి ఎప్పుడూ వస్తుందో అర్థం కావటం లేదు. చివరికి బాబు పై ఈ దాడిని కూడా రాజకీయ పార్టీల నాయకులు ('చిరు' మినహా)ఖండించలేక పోగా, ఇందులో తప్పేమీ లేదు అన్నట్లు మాట్లాడిన kcr, vh లు నేటి రాజకీయాల దిగజారుడు తనానికి నిదర్శనం. ఏది ఏమైనా బాబు కి హృదయ పూర్వక అభినందనలు.

Sunday, September 5, 2010

HCA పై కన్నేసిన TRS

ఇది రెండు రోజుల క్రితం ఈనాడు లో వచ్చిన వార్త. ఆంధ్ర దోపిడీ దారులు, దొంగలు అంటూ నిరంతరం తెలంగాణ యువకులని రెచ్చగొట్టి అమాయకులైన చాలా మంది విద్యార్ధుల ప్రాణాలు పోవటానికి ఏకైక కారణం kcr/trs. వాళ్ళు మాట్లాడే ప్రతి మాట విద్యార్ధులను, నిరుద్యోగులను రెచ్చగొట్టే విధంగానే ఉంటుంది. ఇక ఉద్యమం లో ఇంతమంది విద్యార్ధులు బలిదానం చేసుకుంటే TRS నాయకుడు ఒక్కడికి కూడా ఏమీ కాలేదు. హాయిగా పండగ చేసుకుంటున్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ప్రజలు TRS నే నమ్మి వాళ్ళకు పట్టం కట్టారు. ఇక group 1 విషయం లో కూడా విద్యార్ధులను రెచ్చగొట్టి వాళ్లని విధ్వంసాలకు ఉసిగొల్పుతూ ఈ KCR మహానుభావుడు వెనకాల చేస్తుందేoటయ్యా అంటే వాళ్లకి HCA మీద పట్టు కావాలంట. ఉద్యమం ఇంత ఉధృతంగా నడుస్తూ పిల్లలు బలిదానాలు ఇస్తుంటే వీళ్ళు చేసే పని ఇది. రాష్ట్రం లో చిచ్చు పెట్టి నీ పని నువ్వు సమ్మగా చేసుకుపోతున్నందుకు నీకు వందనాలు KCR.