Monday, April 26, 2010

'పోలవరం' కోసం ప్రజారాజ్యం పోరు








ఇంతకు ముందు ఒకటి రెండు సమస్యలపై (ఉదా: విద్యుత్ సమస్య, కాకినాడ గాస్ లో వాటా) ప్రజా రాజ్యం ఉద్యమాలు చేసినా పెద్ద ఎత్తున ఒక చక్కటి ప్రణాళిక తో ఇలా ఉద్యమించటం ఇదే మొదటి సారి అనుకుంట.

ఇకపోతే ఈ లింక్ ప్రకారం, పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్రం లోని 15 జిల్లాలకు ఉపయోగపడుతుంది, 1941 లో బ్రిటీష్ వాళ్ళ హయాంలో ఈ ప్రాజెక్ట్ ఆలోచన రూపు దిద్దుకుందట. మరి ఇప్పుడు design మారిందో లేదో తెలీదు కానీ, జాతీయహోదా కోసం ప్రయత్నిస్తున్నారంటే ఇది కచ్చితంగా చాలా పెద్ద ప్రాజెక్ట్ అయ్యుండాలి. దీని శంకుస్థాపన జరిగి కూడా చాలా యేళ్లయినా, కారణాలు ఏవైనా ప్రాజెక్ట్ మాత్రం ముందుకు జరిగినట్లు లేదు.

ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్ గురించి, ప్రతిపక్షం లో ఉన్న తెలుగుదేశం మరి ఎందుకు పట్టించుకోలేదో తేలేదు కానీ, ప్రజారాజ్యం మాత్రం serious గా తీసుకున్నట్లుంది. ఇంతకు ముందు కొన్ని సమస్యలపై ప్రజారాజ్యం ఉద్యమాలు చేసినా (ఉదా: విద్యుత్ కోత, కాకినాడ గాస్) అవి ముఖ్యంగా ఒకటి రెండు రోజులు మాత్రమే సాగాయి. మొదటి సారి ఇప్పుడు ఏకంగా ఇలాంటి సమస్యపై ఇంత పెద్ద ఎత్తున ఉద్యమించటం అభినందనీయం. రైతులకు అవగాహన పెంచటం కోసం CD కూడా రూపొందించారట. కచ్చితంగా ఇలాంటి నిజమైన ప్రజాహిత కార్యక్రమాలు, ఉద్యమాలు ప్రభుత్వం పై ఒత్తిడి పెంచుతాయని భావిద్దాం.
మొత్తానికి ప్రజారాజ్యం మంచి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఎదుగుతుంది అనిపిస్తుంది.
All The Best PRP.

Thursday, April 22, 2010

చిరoజీవి తెలంగాణ ద్రోహి కాదు...

సమైక్యరాష్ట్రం కోరుకొనే వాళ్ళు తెలంగాణ ద్రోహులు కాదు. రాష్ట్రం లో ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. తెలంగాణ ప్రజలలో కూడా సమైక్యం కోరుకొనే వాళ్ళు ఉన్నారు.

ద్రోహి అంటే పైకి ఒకటి చెప్తూ వెనకాల వెన్నుపోటు పొడిచే వారు.
ఉదా:
1) తెలంగాణ తెచ్చేది ఇచ్చేది కాంగ్రెస్సే అని తెలంగాణ లో చెప్తూ తెలంగాణ ను అడ్డుపెట్టుకొని పెద్ద పెద్ద పదవులను కొట్టేసి తెలంగాణా కి పైసా పని చేయని కాంగ్రెస్ సీనియర్ నాయకులు తెలంగాణ ద్రోహులు.
2) తెలంగాణ కు అనుకూలం అని చెప్తూ సీమాంధ్ర లో నిరాహార దీక్షలు, బస్సు యాత్రలు చేయించి అక్కదేమో సమైక్యం అని, ఇక్కడేమో జై తెలంగాణా అని రెండు ప్రాంతాల ప్రజలను మభ్య పెడుతున్న తెలుగుదేశం రెండు ప్రాంతాల ద్రోహి
౩) అదుగో తెలంగాణ, ఇదిగో తెలంగాణా అంటూ ఉద్యమం పేరు చెప్పుకొని డబ్బులు గుంజుకుంటూ, సొంత నియోజక వర్గం లో వరదలు వచ్చి అంతా పోతే కనీసం ఏమీ చేయకుండా...దోపిడీ దారులు, వలస వాదులు, ఉద్యోగాలు, వివక్ష, వెనకబాటుతనం అంటూ రెచ్చగొట్టుడు ప్రసంగాలు చేసి అమాయక విద్యార్ధుల ప్రాణాలు బలి దీసుకొని, చివరికి శ్రీకృష్ణ కమిటీ దగ్గర స్వయంపాలన అంటూ మాట మార్చి, సమ్మగా ఇప్పుడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం కోసం మీటింగులు పెట్టుకుంటున్న kcr/TRS తెలుగు ప్రజల అతి పెద్ద ద్రోహి.


వీళ్లందరు చేసిన ఏ ఒక్క దుర్మార్గపు పని చిరంజీవి చేయలేదు. తన నిర్ణయం మార్చుకున్నాడు తప్ప, నిర్ణయం మార్చుకోలేదు అని చెపుతూ రెండు ప్రాంతాలు, రెండు నాల్కలు, రెండు కళ్ళు అని వేదాలు వల్లే వేయట్లేదు.

చివరిగా: చిరంజీవి కి సమైక్యంగా ఉండాలంటు తెలంగాణ లో పర్యటించే అన్నీ హక్కులు ఉన్నాయి. Really looking forward to it.

పదునెక్కుతున్న చిరు మాటలు













రాష్ట్ర కమిటీ సమావేశం లో చిరు ఉద్వేగంతో చేసిన ప్రసంగం బాగుంది. ఎంతో ఆకర్షణ ఉన్న సినిమా రంగంలో 30 యేళ్లుగా character/వ్యక్తిత్వం కాపాడుకున్నాను అంటూ తెలుగు బిడ్డనైన నాకు రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ తెలంగాణా లో పర్యటించే అన్ని హక్కులు ఉన్నాయి అని చెప్పటం బాగుంది. ఇది చాలా correct. సమైక్యంగా ఉండాలని కొంత మంది తెలంగాణా వారు కూడా కోరుకుంటున్నారు. సమైక్యం అన్నంత మాత్రాన వారిని తెలంగాణా దోషులుగా TRS చిత్రించటానికి ప్రయత్నించటం దారుణo.

Thursday, April 8, 2010

ప్రజారాజ్యం నివేదిక సమర్పణ


రాష్ట్రం లో వెనుకపాడిన జిల్లాలే ఉన్నాయి ప్రాంతాలు కాదు అన్న statement నూటికి లక్ష పాళ్లు correct. నివేదికతో పాటు కొన్ని పరిష్కారాలను సూచించటం కూడా బాగుంది. TDP, congress లాగా ద్వంద్వ వైఖరితో double game ఆడకుండా ఒక స్పష్టమైన, కఠినమైన నిర్ణయాన్ని తీసుకొని ఆ మేరకు నివేదిక ఇచ్చిన ప్రజారాజ్యానికి మరో సారి అభినందనలు. TDP, congress లకు రాష్ట్రం లో వాళ్ళ వాళ్ళ పార్టీలను కాపాడుకోవటమే కావాలి తప్ప రాష్ట్ర ప్రజల బాగు కాదు అని చెప్పటానికి తెలంగాణ అంశం ఒక్కటి చాలు. TDP, congress go back. Jai ప్రజా రాజ్యం.