Monday, May 18, 2009

ప్రజా రాజ్యం తుస్సు మన్నదా?

ఒక రెండు మూడు రోజుల్నుంచి ఈనాడు లాంటి విష పత్రికల వాళ్లు, మన బ్లాగు సోదరులు అందరు ప్రజా రాజ్యం తుస్సు మంది అనో ఘోరం గా ఓడింది అని అంటున్నారు. అలా అనటం ఎంత వరకు సమంజసం? 
1) ప్రజా రాజ్యానికి వచిన సీట్లు 18, వోట్ల శాతం సుమారు 16. 130 సంవత్సరాల నుంచి ఉన్న పార్టీ  కి  36% వోట్లు వస్తే, 30 ఏళ్ల నుంచి ఉన్న పార్టీ కీ 26% వస్తే, 8 నెలలున్న పార్టీ కి 16% శాతం వోట్లు వచ్చాయి. ఇది విజయం కాదా?. 
2) ఒక వేళ శాతం ప్రకారం సీట్లు వచ్చి ఉంటే కాంగ్రెస్ కి సుమారు 100, తెదేపా కి 75, ప్రరాపా కి 50 వరకు వచ్చి ఉండేవి. ఎనిమిది నెలలు వయసు ఉన్న పార్టీ కి ఇంత స్పందన రావటం తుస్సుమన్నట్లా?    
3) వై యెస్ ఇదేళ్లలో, బాబు 9 ఏళ్లలో వాళ్ల వాళ్ల పాలన ఎంటొ ప్రజలకు చూపించారు. వాళ్లకి వోట్లు వేసిన వాళ్లు ఆ పనులని చూసి వోట్ వేసుంటారు ఆయా పార్టీలకు. కాని ఇంత వరకు రాజకీయాల్లోనే లేని ఒక వ్యక్తి కి 16 శాతం వోట్లు రావటం, ముక్కోణపు పోటి లో ఒక్కరితోను పొత్తు లేకుండా తర తరాల నుంది ఉన్న పార్టీ లను ఖంగు తినిపించి 18 సీట్లు గెలుచుకోవటం వోటమి అవుతుందా?   
4) ఈనాడు, సాక్షి లాంటి విలువల్లేని వార్తా పత్రికలు చిరు పార్టీ పెట్టక ముందు నుంచి చేసిన నెగిటివ్ ప్రచారాన్ని తట్టుకొని, ఎన్నికలు ఇంకో పది రోజులు ఉందనగా పరకాల లాంటి వాళ్ల తో ఆడించిన డ్రామాలను  తట్టుకొని అన్ని సీట్లు సాధించటం ఏ రకంగా వోటమి? ఇప్పుడు ఇలా అనే పత్రికలలో ఒక్కళ్లు కూడా ఎన్నికల ముందు చేసిన విశ్లేషణలలో ప్రజా రాజ్యానికి 40 కన్నా సీట్లు వస్తాయని రాయలేదు. ఇప్పుడు మాత్రం తుస్సు, బర్రు అంటారు.
5) ఒక వేళ వై యెస్ గాని, చంద్ర బాబు కాని వాళ్ల పార్టీ లను వదిలి కొత్త పార్టీ ని పెట్టి వాళ్ల వాళ్ల వ్యక్తి గత బలాల మీద 16% వోట్లు సాధించే దమ్ము ఉందా? అసలు వాళ్లకే కాదు మన రాష్ట్రం లో ఎవరికైనా ఉందా? వాళ్లకు వచ్చే వోట్ల లో సిం హ  భాగం వోట్లు ఆయా పార్టీలను తరతరాలుగా వెన్నంటి ఉన్న ప్రజలవి. ఇలా సొంత బలమే పార్టీ బలంగా వచ్చిన వ్యక్తి 18 సీట్లు సాధించాడు.
6) ఒకప్పుడు రామారావు పార్టీ పెట్టటం తోనే అధికారం లోకి వచ్చాడు. కాని అప్పుడున్నట్లు రాజకీయ శూన్యత, ప్రభుత్వ వ్యతిరేకత ఇప్పుడు లేవు. అవి లేక పోగా విలువల్లేని మీడియా, దబ్బు ప్రభావం ఇలాంటివి దాపురించాయి. ఇవన్ని మన పత్రికలకు చిరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు  రాశారు కూడా. వీటిని తట్టుకొని పార్టీ 18 స్థానాల్లో మొదటి స్థానం లో, 34 స్థానాల్లో రెండో స్థానాల్లో నిలిచింది. ఇది ముమ్మాటికీ గొప్పే. అయితే 230 స్థానాల్లో ముడో స్థానం లో ఉంది అని రాశారు మన "largest circulated daily of AP (that circulates largest number lies daily) " వారు.  
 పార్టీ పెట్టగానే 200 సీట్లు వస్తాయనుకోవటం అతిశయోక్తే అవుతుంది. ఈ మంచి ప్రారంభాన్ని పార్టీ మరింత బలోపేతం చేయటానికి వాడుకుంటారు అని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. 

9 comments:

Shiva Bandaru said...

మీరు చెప్పినవి అందరూ గుర్తించుకోవలసినవి .మంచి విశ్లేశణ . ఒక కొత్తవ్యక్తి తొమ్మిది నెలల కాలంలో సుమారు కోటి వోట్లను పొందటం గొప్ప విశయమే.

Anonymous said...

పార్టీ పెట్టగానే 200 సీట్లు కాదు, 292 వస్తాయని అల్లు అరవింద్ చెప్పాడు కదా. మేము ఎవ్వరితోను పొత్తు పెట్టుకొము అని ఓవర్ కాంఫిడెన్స్ చూపించారు కదా. Hype క్రియేట్ చేసింది వాళ్ళే. అందుకే ఈ రోజు తుస్సుమన్నారు అని జనాలు అనుకుంటున్నారు. అంతేకాని 18 సీట్లు వచ్చినందుకు కాదు. అదీ కాక, అత్తగారి వూరిలో చిరంజీవి ఓడి పోవటం, దేవేందర్ గౌడ్ 2 చోట్ల ఓడిపోవటం, అల్లు అరవింద్, కృష్ణం రాజు, భూమా నాగిరెడ్డి వంటి హైప్ క్రియేటెడ్ పర్సన్స్ ఓడిపోవటం వల్ల ప్రజారాజ్యం తుస్సుమన్నదని అనుకుంటున్నారు. లోక్‌సత్తా కేవలం ఒక్క సీట్ గెలిచింది. కానీ సత్తా చూపించింది అని ఎందుకు అంటున్నారు? వాళ్ళు హైప్ క్రియేట్ చెయ్యలేదు కాబట్టి.

chavakiran said...

క్రింద పడ్డా చెయ్యి పైన్నే ఉందంటావ్

Gavesh said...

చిరంజీవి సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచీ కౌంట్ చేయాలి, కేవలం 8నెలల పార్టీ కాదు, ఇది కూడా 30ఏళ్ళ్ పార్టీనే అని నా అభిప్రాయం.

పుల్లాయన said...

anonymous gaaru,
ఎవరు పార్టీ పెట్టినా మేము అన్ని స్థానాల్లో ఓడిపోతాము అనరు. 30 ఏళ్ల చరిత్ర కల ఈనాడు మహా కూటమి స్వీప్ చేస్తుంది అని రాస్తే అతి కష్టం మీఅద 100 సీట్లు వచ్చాయి. అఫ్కోర్స్ 290 సీట్లు అనటం అహంకారం అని అల్లు ఈ పాటికి తెలుసుకొనే ఉంటాడు. ప్రజా రాజ్యం రోడ్షో లకు వచ్చిన జనాలను చూసి క్రియేట్ అయిన హైప్ అది. అయినా యే ఒక్క సర్వే కూడా దానికి 40 సీట్లు వస్తాయని రాయలేదు.

చావా గారు,
ఎవరండి కింద పడింది? 30 ఏళ్ల అనుభవం ఉండి సొంతంగా గెలవ లేక 4 పార్టీ లతో పొత్తు పెట్టుకొని కూడా ఓడిపోయిన వాళ్లా లేక 8 నెలల క్రితం పార్టీ పెట్టి సొంతం గా పోటీ చేసిన వాళ్లా?

చావాకిరణ్ said...

ఇద్దరూ క్రింద పడ్డారు.
అయినా 30 నెళ్ల వాళ్ల గురించి నేను ఇక్కడ తీసుకొని రాలేదు, మీరు మార్పు వీరుల చెయ్యి పైనుంది అంటున్నారు అని మాత్రమే చెప్పాను.
ఒక్కటి మాత్రం అర్థం అయింది నువ్వు మాత్రం మారవు.
మరో ఐదు సంవత్సరాల తరువాత కూడా రాజశేఖర్ రెడ్డికి అధికారాన్ని బంగారు పళ్లెంలో అప్పగించటానికి తప్ప మరెందుకూ పనికి రాని పార్టీ అది.

పుల్లాయన said...

చావా గారు :)

నేను మారక పోతే మీరన్నా మారొచ్చు కదా :)

oremuna said...

మేము మారబట్టే ఆ వ్యాఖ్య. మారకపోతే లైట్ తీసుకునే వాళ్లం.

Aravinda said...
This comment has been removed by the author.