Tuesday, May 3, 2011

సీమాంధ్ర తేనెటీగలు




మొన్న అక్బరుద్దీన్ మీద దాడి జరిగితే మన హరీష్ రావు statement అది సీమంధ్రుల కుట్ర అంట. ఇంకా నయం నిన్న లాడెన్ మీద అమెరికా దాడి కూడా సీమంధ్రుల కుట్ర అని, జూపల్లి మీద సీమంధ్రుల కుట్ర అని అనలేదు. లేకపోతే ఇంకో అడుగు ముందుకు వేసి ఇది సీమంధ్ర తేనెటీగల కుట్ర, సీమాంధ్ర తేనెటీగల దురహంకారానికి ప్రతీక అంటారేమో.

Monday, February 7, 2011

prp మూసేశారు...అందరూ పండగ చేసుకోండి.

TDP అభిమానులు: మీరు పండగ చేసుకోండి. prp వోట్లు చీల్చటం వల్లే ఓడిపోయాం అన్నది మీ వాదన కాబట్టి మీకు ఇది పెద్ద పండగే. ఇక మీ ఛానెల్స్ లో మీరు ఒక పార్టీ గురించి దుమ్మెత్తి పోయాల్సిన అవసరం లేదు. మీ పార్టీ గురించి గొప్పలు చెప్పుకుంటే సరిపోతుంది.

కాంగ్రెస్ అభిమానులు: మీరు కూడా పండగ చేసుకోండి. ప్రజారాజ్యం తెలుగు దేశం వొట్ల కన్నా మీ వోట్లే ఎక్కువ చీల్చింది అన్నది మీ భావన కాబట్టి మీకు కూడా మంచిదే. మీ పార్టీ కి free గా ఒక ప్రచార కర్త దొరికాడు కూడా.

prp అభిమానులు: హమ్మయ్య ప్రజా రాజ్యం పార్టీ ఇంక మూసేశారు. ఇంక ఎంత అడ్డమైన వెధవ చిరు ని కామెంట్ చేసీనా బాధ పాడాల్సిన అవసరం లేదు. పార్టీ గురించి ఎప్పుడు ఏ ఛానెల్ వాడు దుష్ప్రచారం చేస్తారో అన్న బెంగ లేదు. పార్టీ నుంచి ఎవరు బైటికి వెళ్లిపోతారో అన్న సందేహం లేదు. వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుస్తారో అన్న ఆలోచన అంతకన్నా లేదు.

చిరు అభిమానులు: మీకు పండగే పండగ. ఈ పాడు రాజకీయాలు మనకు వద్దు. మన 150 వ సినిమా కి లైన్ క్లియర్ అయిపోయింది. ఇంక దర్శకుడు ఎవరు? పాటలు ఎప్పుడు release అవుతాయి. సినిమా ఎలా ఉంటుంది అన్న ఆలోచనలతో మనం time pass చేసుకుందాం. :)

జై బోలో తెలంగాణ

ఈ సినిమా ఇంకా చూడలేదు కానీ ఈ సినిమా విడుదలకు ముందు OU జేఏసి అని చెప్పుకొనే కొంత మంది వ్యాఖ్యల గురించి ఈ టపా.

విడుదలకు రెండు నెలల ముందు నుంచి వీరి ఆరోపణలకు నవ్వాలో ఏడవాలో అర్థం అయ్యేది కాదు. అప్పుడు తెలుగు సినిమా వాళ్ళు ఏదో strike అని షూటింగ్లు ఆపేస్తే అది ఈ సినిమా ని అడ్డుకోవటానికి నిర్మాతల మండలి లో ఉన్న సీమంధ్రులు ప్రయత్నిస్తున్నారు అని ఒక అర్థం లేని ఆరోపణ. ఈ సినిమా కు permission ఇవ్వకపోతే సీమంధ్ర సినిమాలను ఆడనివ్వరట. సరే వీళ్లతో మనకెందుకు అనుకోని ఆ సినిమా కి షూటింగ్ చేసుకోమని permission ఇచ్చారు.

తర్వాత సెన్సార్ కి వెళ్లాక వాళ్ళు కొన్ని సన్నివేశాలు తొలగించాల్సిందిగా సూచించారట. మళ్ళీ లొల్లి మొదలు. "సెన్సార్ బోర్డ్ లో ఉన్న సీమంధ్ర వారు సినిమాను అడ్డుకుంటున్నారు..మేము సీమంధ్ర సినిమాలను అడ్డుకుంటాం" అని మళ్లీ ఇంకో ప్రకటన. సెన్సార్ బోర్డ్ లో ఉన్న సీమంధ్రులకు, నిర్మాతల మండలి లో ఉన్న సీమంధ్రులకు ఈ సినిమా ను ఆపటం తప్ప ఇంకేం పని పాట లేదు అని వీళ్ళ ఉద్దేశం కాబోలు. సరే సెన్సార్ బోర్డ్ వాళ్ళు కూడా ఈ ప్రాంతీయ గొడవలు మనకెందుకు అంటూ కేంద్ర సెన్సార్ బోర్డ్ వారికి ఈ సినిమా లోని కొన్ని అభ్యంతర కర సన్నివేశాలను చూపించి ఎలా ముందుకు వెళ్లలో మీరే సూచించండి అని అక్కడికి పంపించారు. వారు ఏవో సూచనలు ఇస్తే దాన్ని బట్టి సినిమా లో కొన్ని సన్నివేశాలు తొలగించారంట.

తెలంగాణ ఉద్యమం లో భాగంగా తెలంగాణ గురించి సినిమా తీసుకోవటం, ప్రత్యేక తెలంగాణ కావాలని కోరుకొనే హక్కు తెలంగాణ ప్రజలకు ఉంది కానీ ప్రతి దానికి సీమంధ్రుల మీద ఏడుపేంటో అర్థం కాదు. తుమ్మినా, దగ్గినా సీమంధ్రుల సినిమాలు అడ్డుకుంటారంట.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే, టైమ్స్ ఆఫ్ ఇండియా లో ఈ సినిమా గురించి రాసిన ఈ వ్యాసం చూడండి.
ఈ సినిమాని అడ్డుకుంటే అది చేస్తాం ఇది చేస్తాం అని ప్రగల్భాలు పలికారే కానీ, ఈ సినిమా ని ప్రొడ్యూస్ చేయటానికి తెలంగాణ నుంచి ఒక్కరూ ముందుకు రాలేదు. దాంతో ఈ సినిమా దర్శకుడే ఈ సినిమా ప్రొడ్యూస్ చేయల్సోచింది. సినిమా హాళ్లలో పోస్టర్స్ లో చాలా చోట్ల kCR cutout లు పెట్టారు తెరాస వారు. సినిమా ని నిర్మించటానికి ఈ మహానుభావుడు ముందుకు రాడు కానీ అతను, వాళ్ళ పార్టీ ప్రచారం మాత్రం బాగా జరగాలి ఈ సినిమా ద్వారా. ఇక తెలంగాణ నుంచి కూడా ఈ సినిమా కి distributers కూడా అంతగా ఇంటరెస్ట్ చూపించట్లేదు అని రాశారు.

కాబట్టి OU JAC/TRS నాయకుల్లారా: తెలంగాణ లోనే ఇటువంటి మిశ్రమ స్పందన ఉంటే సీమాంధ్ర వాళ్ళు అడ్డుకుంటున్నారు, కుట్ర అంటూ సీమాంధ్ర వారి మీద నిందలు వేయటం ఎంత వరకు కరెక్ట్? తెలంగాణ కావాలంటే ఏ ప్రాతిపదికన కావాలో స్పష్టంగా చెప్పండి. అంతే కానీ లేని పోనీ ఆరోపణలలతో తెలుగు వారి మధ్య వైరుధ్యం పెంచకండి.

Monday, January 10, 2011

లక్ష ... సారీ...కోట్ల తో జగన్ దీక్షలు

జగన్ దీక్షల గురించి ఆంధ్రప్రభ లో ఇవ్వాళ వచ్చిన వ్యాసం ఇది.


Saturday, January 1, 2011

శ౦కర్ దాదా అవతారమెత్తి మానవత్వం చాటిన 'చిరు'

గుంటూరు జిల్లా పర్యటన లో చిరు రాజకీయ నాయకులకు సహజంగా ఉండని మానవత్వాన్ని చాటారు. రెండేళ్ల క్రితం bike accident జరిగి కొమా లో ఉన్న ఒక అభిమానిని శంకర్ దాదా సినిమా లో లాగా కదిలించటానికి ప్రయత్నించారు. చిరు ని చూసి ఆ అభిమాని రెండు మూడు సార్లు కళ్లరెప్పలు ఆర్పాడు. అతనిలో కొంచెం కదలిక వచ్చింది. అతని ఇంటికి వెళ్ళటం schedule లో లేకపోయినా, ఒక నాయకుడు అతని విషయం చెప్పేసరికి వాళ్ళ ఇంటికి వెళ్ళి 45 నిముషాలు గడిపాడు. అంటే కాకుండా nims లో వైద్యం చేయిస్తానని మాట కూడా ఇచ్చారు.
ఇక ఇంకో సంఘటన లో కళ్ళు అంతగా కనపడని ఒక ముసలి దంపతులు కాన్వాయ్ దగ్గరకు రావటం గమనించిన చిరు, తన వాహనం దిగి వాళ్ళ కష్టాలను తెలుసుకొని వారికి కంటి చికిత్స ఖర్చులు భరిస్తానని మాట ఇచ్చాడు. ఇంకో సందర్భం లో ఆత్మ హత్య చేసుకున్న కుటుంబం లో ఒక తల్లి పిల్లలను ఎలా చదివించాలి అని బాధ పడుతుంటే, మొదట ఇచ్చిన 25 వేలకు అదనంగా పిల్లల చదువుల కోసం ఇంకో 25 వేలు ఇచ్చి ఉన్నత విద్య కోసం తనకు తెలిసిన వల్ల కాలేజ్ లో సీటు ఇప్పిస్తానని చెప్పారు.

ఇలా అన్నీ చోట్ల చిరు మానవత్వాన్ని చూపించారు. విచిత్రం ఏంటంటే చిరు shakehand ఇవ్వలేదని, ఒక ఊరికి రాలేదని ఎవరన్నా అభిమాని చిరు ని తిడితే మాత్రం box పెట్టి మరీ రాసే మీడియా వాళ్ళు ఈ విషయాలకు కనీస coverage కూడా ఇవ్వకపోవటం.





Friday, December 31, 2010

రాజకీయ బలప్రయోగాలు vs రాజకీయ చేయూత

ప్రార్ధించే పెదవుల కన్నా చేయూతనిచ్చే చేతులు మిన్న అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఈ మధ్య వచ్చిన అకాల వర్షాల వల్ల ఎంతో మంది రైతులు మరణించారు, ఇంకా మారనిస్తూనే ఉన్నారు. వారికి ప్రభుత్వం ప్రకటించిన సాయం పక్కన పెడితే ప్రతిపశాలు మాత్రం దీక్ష లు, గర్జనలు అంటూ తెగ గోల చేస్తున్నాయి.

జగన్ లక్ష దీక్ష అంటూ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఇది ఒక నిరాహార దీక్ష లా కాకుండా ఒక బల పరీక్ష లాగా, ఒక పార్టీ announcement సభ లాగా జరిగింది. కొత్తగా రిలీస్ అయ్యే సినిమా కి పబ్లిసిటీ కి ఎంత ఖర్చు పెడతారో అంతకు 100 రెట్లు ఖర్చు పెట్టారు ప్రచారం కోసం ఒక్క కృష్ణా జిల్లాలోనే. ప్రతి ఊళ్లో వందల పోస్టర్లు బానర్లు కట్టారు. ఒక మనిషి దగ్గర లక్ష కోట్లు ఉంటే మీడియా మొత్తాన్ని కొని, ఇంకా డబ్బులతో ఏమేమి చేయవచ్చో దానికి ఈ దీక్ష, జగన్ ప్రత్యక్ష ఉదాహరణలు. ఈ దీక్ష కు పెట్టిన ఖర్చు తో రైతులను ఆడుకోవచ్చు కదా అంటే ఆ పని మాత్రం చేయడు. ఎందుకంటే ఇతనికి కావాల్సింది బలపరీక్ష కానీ రైతు సంక్షేమం కాదు. ఈ దీక్ష వల్ల రైతులకు ఒరిగింది పేద్ద గుండు సున్నా.


ఇక చంద్ర బాబు దీక్షలో పెద్దగా హంగు ఆర్భాటాలు లేవు. కాకపోతే తెలివిగా ప్రచారం కోసం డబ్బులు ఖర్చుపెట్టకుండా, తెలివిగా (ఊరు, పేరు లేని) జాతీయ నేతలతో హంగామా చేసి వాళ్ల కోసం ప్రత్యేక విమానాలు ఈర్పాటు చేసి చివరికి ప్రభుత్వం కొద్దిగా కూడా స్పందించకపోవటంతో సమ్మగా చిన్న డ్రామా ఆది సర్దుకున్నాడు. ఇక ఇప్పుడు బలపరీక్ష మొదలు పెట్టింది తెలుగు దేశం కూడా. రైతుకోసం అని పేరు పెట్టి ఈ సభ కోసం మరి ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారో వాళ్లకే తెలియాలి. ఇక వీళ్ళ సొంత మీడియా దీనికి ఇస్తున్న coverage అంతా ఇంతా కాదు. ఇక్కడ కూడా రైతులకు ఒరిగేది ఏమీ లేదు. బండి సున్నా.


ఇక మన అభిమాన నేత kcr తెలంగాణ లో ఇంత మంది రైతులు చనిపోయిన అసలు చీమా కూడా కుట్టినట్లు లేదు ఇతనికి. కనీసం తెలంగాణ రైతుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తెలంగాణ రాకముందే ఇతను ఇలా ఉంటే ఇక తెలంగాణ వచ్చాక ఏంచేస్తాడో మనం ఊహించుకోవచ్చు. ఇక్కడ సున్నా కూడా అనవసరం. నో సున్నా


వీళ్లందరితో పోల్చుకుంటే అంత వనరులు లేకపోయినా, హంగు ఆర్భాటం లేకుండా చిరు అందిస్తున్న సహకారం అభినందనీయం. పై రెండు దీక్షలపై వచ్చిన కధానాలలో కనీసం వందో వంతు కధానాలు కూడా 'చిరు' సహాయం గురించి కనిపించదు మన మీడియా లో. వీరు అందించే 25 వేలు చాలా తక్కువ మొత్తం అయ్యుండొచ్చు. కానీ చనిపోయిన రైతు కుటుంబాలలో ఇదే కొంచెం ధైర్యాన్ని నింపుతుంది.














Friday, December 10, 2010

తెలంగాణ పై వివక్ష

తెలంగాణ పై పాలకులే కాకుండా ప్రకృతి కూడా వివక్ష చూపుతుంది. గత సంవత్సర కాలంగా వచ్చిన తుపానులే ఇందుకు నిదర్శనం. లైలా, జల్ తుఫానులు కోస్తా జిల్లాలో భారీ పంట నష్టం, ప్రాణ నష్టం కలిగించాయి. జల్ తుఫాను అయిన 10 రోజుల తర్వాత కూడా విజయవాడ నుంచి నేను తిరుపతి వెళ్తుంటే నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో నీటిలో మునగకుండా ఒక్క పంట పొలం కూడా కనిపించలేదు. అంతలా దెబ్బ కొట్టింది ఆ తుఫాను. ఈ సంవత్సరం మొదట్లో బాగా వర్షాలు పడటం తో పంట కూడా కొద్దిగా త్వరగా కోతకొచ్చే సమయం లో జల్ తుఫాను కోస్తా జిల్లాలలో రైతులకు గుండె కోత ను మాత్రమే మిగిల్చింది. జల్ తుఫానులో అంతగా నష్టం జరగని జిల్లాలలో ఈ వారం వచ్చిన తుఫాను వల్ల ఎక్కువ అప్పుడు బయటపడి బట్టగట్టిన పంటలు కూడా నాశనం అయిపోయాయి.

ఈ లింక్ http://disastermanagement.ap.gov.in/website/cyclone.htm చూస్తే కనక గత వంద సంవత్సరాలలో వందకు పైగా తుఫానులు కోస్తా జిల్లాలను అతలాకుతలం చేసినట్లు తెలుస్తుంది. ఇంకొంచెం గమనిస్తే నీళ్ళు బాగా ఉండి పంటలు బాగా పండుతాయి ఆనుకొనే గోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో తుఫానుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది.

యేతా వాతా నేను చెప్పొచ్చేదేంటంటే తుఫానులు కూడా తెలంగాణ పై వివక్ష చూపుతున్నాయి. ఈ తుఫానులు కొద్దో గోప్పో తెలంగాణ లోనూ ప్రతాపం చూపుతున్నా, కోస్తా తో పోలిస్తే తెలంగాణ జిల్లాలలో జరిగే నష్టం కొంచెమే. మా నీళ్ళు దోచుకుంటున్నారు అని తెగ బాధ పడే తెలంగాణా వాదులు (అందరు తెలంగాణ వాదులు కాదు...కొంత మంది మాత్రమే) తుఫానులలో కూడా తెలంగాణ కు వాటా కావాలని కోరుకోరెoదుకు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. తుఫానులు చూపుతున్న వివక్ష ను ఖండిస్తూ తుఫాను దిష్టి బొమ్మ దగ్ధం చేసి తెలంగాణ వ్యాప్త బంద్ కు OU JAC పిలుపు ఇవ్వాలని ఆశిస్తున్నాను.