Friday, May 7, 2010

చిరు పోలవరం యాత్ర effect...ఒత్తిడి లో congress, TDP

ఒక చిన్న పార్టీ అయినా ఈ విషయం లో పెద్ద పార్టీలకు ఆదర్శంగా, మార్గదర్శకంగా నిలిచింది ప్రజారాజ్యం. పకడ్బందీ ప్రణాళిక తో రూపొందించిన ఈ యాత్ర రెండో రోజుకు చేరుకోనేలోపే సత్ఫలితాలను ఇస్తుంది. ఒక పక్క యాత్ర కు విశేషమైన జన స్పందన లభిస్తుండగా ఇంకో పక్క మిగతా రాజకీయ పార్టీలు కూడా ఇలాంటి ప్రాజెక్టులకోసం నడుం బిగిస్తున్నాయి. congress MP లు ఇప్పటికే ప్రధానిని కలిసి పోలవరం ప్రాజెక్టు జాతీయహోదా కోసం విజ్ఞప్తి చేయగా తెలుగు దేశం కూడా పోలవరం, ప్రాణహిత ప్రాజెక్టుల కోసం పోరాటం చేస్తామంటుంది. మొత్తానికి అన్నీ పార్టీలు ప్రజా హితమైన ప్రాజెక్టుల మీద దృష్టి సారించాయి. ఈ బుద్ధేదో ముందే ఉంది ఉంటే మనకు ఇన్ని సంవత్సరాల పాటు రైల్వేలలో, కేంద్ర నిధులలో రాష్ట్రానికి ఇంత అన్యాయం జరిగి ఉండేది కాదేమో.

ఇక చివరిగా చెప్పాల్సింది ఏంటంటే, ఒక కొత్త పార్టీ రావటం వల్ల ప్రజలకు మేలే జరుగుతుంది కానీ కీడు జరగదు అన్న దానికి ఇది perfect ఉదాహరణ. పోతే ప్రజారాజ్యం కూడా చిన్నగా గాడిలో పడుతుంది అనిపిస్తుంది. వచ్చే ఎన్నికల కల్లా prp ఉండదు అని, prp congress లో కలిసి పోతుంది అని దుష్ప్రచారం చేసే వాళ్ళకు చిరంజీవి చెప్పే సమాధానం చూస్తుంటే ముచ్చటేస్తుంది.



1 comment:

lakshman said...

good article. keep it up.